యాప్నగరం

తమిళనాడు సీఎంకు హైకోర్టు షాక్.. అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం

పళని స్వామికి షాకిచ్చిన మద్రాసు హైకోర్టు. హైవే కాంట్రాక్టల విషయంలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశం..

Samayam Telugu 12 Oct 2018, 5:17 pm
తమిళనాడు సీఎం పళనస్వామికి చుక్కెదురయ్యింది. పళనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హైవే కాంట్రాక్ట్‌లకు సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్న విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. పారదర్శక విచారణ కోసమే.. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు జస్టిస్ ఏడీ జగదీష్ చంద్ర వ్యాఖ్యానించారు.
Samayam Telugu Palani


సీఎం పళనిస్వామి రాష్ట్రంలో హైవే కాంట్రాక్టుల్ని తన బంధువులకు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై డీఎంకే డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు.. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. ఈ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

కోర్టులో పిటిషన్ వేసిన డీఎంకే పార్టీ ప్రతినిధి భారతి సీబీఐ దర్యాప్తును స్వాగతించారు. సీఎం పళనిస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. రూ.3500కోట్ల విలువైన హైవే కాంట్రాక్టుల్ని తన బంధువులు, బినామీలకు అప్పగించారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పళని.. తన సన్నిహితులు, బినామీలతో కలిసి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.