యాప్నగరం

కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంట్లోనే చికిత్స.. కేంద్రం తాజా మార్గదర్శకాలు

దేశంలో నమోదయిన పాజిటివ్ కేసుల్లో దాదాపు 80 శాతం మందికి వైరస్ లక్షణాలు బయటపడటంలేదు. కరోనా వైరస్ సోకినవారిలో కేవలం 14 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమని చెబుతున్నారు.

Samayam Telugu 29 Apr 2020, 8:54 am
కరోనా వైరస్ బాధితులకు చికిత్స సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా వైరస్‌ స్వల్ప లక్షణాలున్న వారు, వ్యాధి సోకినా ఆ లక్షణాలు లేనివారు ఇక నుంచి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు. స్వీయ నిర్బంధలో ఉండి, ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సహకరించడానికి అంగీకరించే బాధితులకు ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉన్నవారు, చికిత్స పొందుతున్న వారిలో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంఘటలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు ఎలాంటి ఫలితాలన్నిస్తుందోననే ఆందోళన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.
Samayam Telugu health ministry issues guidelines for home isolation of very mild symptoms and asymptomatic people
కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంట్లోనే చికిత్స.. కేంద్రం తాజా మార్గదర్శకాలు


కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు అతి స్వల్పంగా లేదా అసలేమీ లేనట్టు వైద్యుడు నిర్ధారించిన వ్యక్తులు... ఇళ్లలో వసతులుంటే.. కుటుంబసభ్యులతో కలవకుండా విడిగా ఓ గదిలో ఉండాలి.

ప్రభుత్వాసుపత్రి, వైద్యసిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడికి అనుగుణంగా అందుబాటులో ఉండాలి.

పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను వైద్యుల సూచనల మేరకు ముందస్తుగా వినియోగించాలి.

ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకుని.. బ్లూటూత్‌, వైఫై నిరంతరం ఆన్‌లోనే ఉంచాలి.

జిల్లా వైద్యాధికారి, వైద్యసిబ్బందికి తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తెలియజేయాలి. పరీక్షలను ఇంటికి వద్దకే వచ్చి వైద్యసిబ్బంది నిర్వహించేలా అంగీకారాన్ని తెలుపుతూ నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలి.

గడువు పూర్తయిన తర్వాత నమూనాలను పరీక్షలకు పంపి, నెగిటివ్‌‌గా వస్తేనే ఇంట్లో ఐసోలేషన్‌ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.

ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి అస్వస్థత అనిపించినా వైద్యుడిని సంప్రదించి, 1075 నంబరుకు ఫోన్‌ చేయాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆగకుండా నొప్పి, ఛాతీలో పట్టేసినట్లు, మానసిక అయోమయం, చేతల్లో స్థిరత్వం లోపించడం, పెదవులు, ముఖం నీలిరంగులో మారితే తప్పనసరిగా వైద్యులకు సమాచారం ఇవ్వాలి.

ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిరంతరం త్రీలేయర్ మాస్క్‌ను ధరించి, 8 గంటలకొకసారి మార్చి, దానిని ఒకశాతం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపర్చి పడేయాలి. పిల్లలు, వృద్ధులు, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోవాలి.

తరుచూ తగినంత నీరు, ఇతర ద్రావణాలను తాగుతుండాలి. చేతులను ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బాధితుడు వాడిన దుస్తులు, వస్తువులను ఇతరులు వినియోగించరాదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.