యాప్నగరం

ఎడతెరిపిలేని వర్షాలు.. 15 మంది మృతి

కుండపోత వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 17 Jul 2018, 11:11 pm
కుండపోత వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రూ. 8 కోట్ల నష్టం కలిగినట్లు కేరళ రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్ చెప్పారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం 186 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Samayam Telugu kerala rain


భారీ వర్షాల కారణంగా తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కొచ్చి రైల్వే స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపేశారు. వరద ప్రభావం అధికంగా ఉన్న కొట్టాయం జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇడుక్కి జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వరద నష్టాన్ని అంచనా వేయడానికి కలెక్టర్లతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. మరోవైపు.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడం కేరళ వాసులను మరింత భయపెడుతోంది. కేరళ, లక్షద్వీప్ తీరం వెంట గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
Read this in Malayalam

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.