యాప్నగరం

Weather Update: కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త!

Weather Update: దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారం వెదర్ చాలా కూల్‌గా ఉండనుంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 25 Apr 2023, 8:41 pm

ప్రధానాంశాలు:

  • దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు
  • వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్
  • కేదార్‌నాథ్ యాత్రపై మంచు ప్రభావం చూపే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kedarnath Yatra
కేదార్‌నాథ్ యాత్ర
Weather Update: రానున్న 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ (Meteorological Department) అంచనా వేసింది. ఏప్రిల్ 24న సోమవారం వాయువ్య భారతంలో వేడి ప్రభావం కొనసాగింది. జమ్మూ- కశ్మీర్, లడఖ్, గిల్గిట్- బాల్టిస్తాన్, యూపీ, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా,చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ- తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ- తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో వేడి కాస్త పెరగనుంది.
రానున్న 24 గంటల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో రానున్న 6 రోజుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ 27, 28 తేదీల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. 29న ఉరుములతో కూడిన వర్షం, ఏప్రిల్ 30న వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఏప్రిల్ 24 తూర్పు- పశ్చిమ యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ హర్యానా, ఢిల్లీ రాజస్థాన్, కోల్‌కతాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీలోని పాలం, ఉత్తరప్రదేశ్, హమీర్‌పూర్, బారాబంకి, ఘాజీపూర్, అయోధ్య, తూర్పు రాజస్థాన్‌లోని ఫతేపూర్, జైపూర్‌లోని కొన్ని చోట్ల తుఫాను వచ్చింది. ఇటు లాహౌల్- స్పితిలో భారీగా మంచు కురిసింది. BRO యంత్రాలు కోక్సర్ నుంచి కీలాంగ్‌ను కలిపే రహదారిపై మంచును తొలగించాయి.

ఏప్రిల్ 23న ఆదివారం రుద్రప్రయాగ్‌ సమీపంలోని పర్వతాలలో.. మంచు కురిసింది. మరోవైపు ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. తాజాగా కురుస్తున్న మంచు తీర్థయాత్రపై ప్రభావం చూపింది. ఏప్రిల్ 25 నుండి ఏప్రిల్ 26 వరకు ఉత్తరాఖండ్‌లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.