యాప్నగరం

నదిలో పడిపోయిన బస్సు.. 9మంది మృతి

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన బస్సు.. 9మంది మృతి.. 30మందికిపైగా గాయాలు.

Samayam Telugu 25 Nov 2018, 7:41 pm
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు జలాల్ వంతెనపై నుంచి దాదహు నదిలో పడిపోయింది. ప్రమాదంలో 9మంది అక్కడికక్కడే చనిపోగా.. 30మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన సమీపంలోని నాహాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu Bus


ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు రేణుకా జీ ప్రాంతం నుంచి నాహాన్‌కు వెళుతున్న సమయంలో బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని.. ఓవర్ స్పీడుతో వచ్చిన బస్సు బ్రిడ్జ్ రెయిలింగ్‌ను ఢీకొట్టి నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.