యాప్నగరం

మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్య

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ మాజీ చీఫ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 11 May 2018, 4:03 pm
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ మాజీ చీఫ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఆయన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆయన రెండేళ్లుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొంతకాలంగా మెడికల్ లీవ్‌లో ఉన్న ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. నోటిలో గన్ పెట్టుకుని కాల్చుకున్నట్లు సమాచారం. కర్తపు మడుగులో పడిఉన్న రాయ్‌ను సిబ్బంది హుటాహుటిన బోంబే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన మృతదేహం బోంబే హాస్పిటల్‌లోనే ఉంది. హాస్పిటల్ బయట పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
Samayam Telugu Himanshu

కాగా, రాయ్ 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. డిపార్ట్‌మెంటులో అందరితో చాలా కలుపుగోలుతనంగా ఉంటారని ఆయనకు మంచి పేరుంది. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్ దర్యాప్తు, డీజిల్ డాన్ మహమ్మద్ అలీ షేక్ అరెస్టు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అంతేకాకుండా రాయ్ ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్‌గా ఉన్నప్పుడే 26/11 ముంబై ఉగ్రవాద దాడి దోషి, పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అలాగే ఈయన ఏటీఎస్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే ఐఎస్‌లో చేరడానికి వెళ్లిన కళ్యాణ్‌ పట్టణానికు చెందిన అరీబ్ మజీబ్ అనే యువకుడిని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. రాయ్ మరణంతో ముంబై పోలీసు శాఖలో విషాదం అలుముకుంది. నిజాయతీ గల ఐపీఎస్ అధికారిని కోల్పోయామని పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.