యాప్నగరం

స్వచ్ఛతా హీ సేవ: బాపు కలలను నెరవేరుద్దాం.. ప్రధాని పిలుపు

గాంధీజీ 150వ జయంతి వేడుకలను నిర్వహించనున్న తరుణంలో స్వచ్ఛతా హీ సేవ ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.

Samayam Telugu 15 Sep 2018, 10:35 am
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత ఊపునిస్తూ.. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛత హీసేవ ఉద్యమా’నికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, రతన్ టాటా, సద్గురు, శ్రీ శ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి, ఐటీబీపీ జవాన్లు, చిన్నారులతోపాటు 18 ప్రదేశాల్లోని పలువురితో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా.. స్వచ్ఛ భారత్‌ నిర్మించాలనే బాపు కలను నెరవేర్చాలని దేశ ప్రజానీకానికి మోదీ పిలుపునిచ్చారు.
Samayam Telugu pm modi


ప్రతి ఒక్కరూ స్వచ్ఛత ఉద్యమంలో భాగం పంచుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి గ్రామం, వీధి, పట్టణం.. అంతటా స్వచ్ఛతను పాటించాలని మోదీ సూచించారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రైవేట్ రంగం పెద్ద పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నానని మోదీ తెలిపారు. మనమంతా కలిసి బాపు కలలను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.
పరిసరాల శుభత్ర లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని మోదీ తెలిపారు. స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని చెప్పారు. ఈ దిశగా టాటా ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.