యాప్నగరం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌‌కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు..

TNN 4 Aug 2017, 11:14 am
జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌‌కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో.. గురువారం (ఆగస్టు 3) రాత్రి నుంచి పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. ఓ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించిన భద్రతా సిబ్బంది ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఉగ్రవాదులపైకి కాల్పులు జరుపుతుండగా.. ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోవడంతో.. స్థానికులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
Samayam Telugu hizbul mujahideen terrorist killed in encounter in jammu and kashmir
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం


మృతి చెందిన ఉగ్రవాదిని అనంత్‌నాగ్‌కు చెందిన యావర్‌గా గుర్తించారు. కశ్మీర్‌ లోయలో భద్రతా సిబ్బందిపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారుల్లో ఒకడైన యావర్‌.. కొన్ని రోజుల కిందటే హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అధికారులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.