యాప్నగరం

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో అడ్మిట్

హోం మంత్రి అమిత్ షా కరోనా మహమ్మారి బారినపడ్డారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Samayam Telugu 2 Aug 2020, 5:51 pm
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 2) ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు.
Samayam Telugu అమిత్ షా
Amit Shah


‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.


దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సామాన్యులనే కాకుండా ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారినపడ్డారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏపీలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్‌లో కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనా బారినాకు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. బిహార్‌లో బీజేపీకి చెందిన సుమారు 100 మంది నేతలు ఈ ప్రాణాంతక వైరస్ బారినపడ్డారు.

మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది. రెండు రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానానికి ఎగబాకింది.

Also Read: షాక్! వియత్నాంలో తొలి కరోనా మరణం

Must Read: కరోనాతో కుక్క మృతి.. ప్రపంచంలో తొలి కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.