యాప్నగరం

పాక్ మారకుంటే మళ్లీ సర్జికల్ దాడులు

పాకిస్థాన్ తీరు మారకుంటే, అదేపనిగా తీవ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పితే మళ్లీ సర్జికల్ దాడులు తప్పవని

Samayam Telugu 3 Feb 2017, 4:39 pm
పాకిస్థాన్ తీరు మారకుంటే, అదేపనిగా తీవ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పితే మళ్లీ సర్జికల్ దాడులు తప్పవని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. దావూద్ ను పట్టుకోవడం పెద్ద విషయం కాదని..కాకపోతే దానికంటూ ఓ టైం రావాలని ఆయన చెప్పారు.
Samayam Telugu home minister rajnath says surgical strikes on pak again cant ruled out
పాక్ మారకుంటే మళ్లీ సర్జికల్ దాడులు


నెట్ వర్క్18కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్ నాథ్ పలు అంశాలపై మాట్లాడారు.

‘‘పాకిస్థాన్ మన పొరుగుదేశం. తీరు మార్చుకుంటే అలాంటి నిర్ణయం (సర్జికల్ దాడులు) తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ తీవ్రవాద సంస్థలు, ఇతర సీమాంతర ఉగ్రవాదులు భారత్ ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం మళ్లీ సర్జికల్ దాడులు ఉండబోవని మాత్రం గ్యారెంటీ ఇవ్వలేను’’ అని ఆయన విస్పష్టంగా చెప్పారు.

హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం గృహ నిర్భందం చేసినప్పటికీ..అది తూతూ మంత్రమేనని. తీవ్రవాదాన్ని తుదముట్టించాలనే లక్ష్యం ఉంటే అతణ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ను పట్టుకోవడంపై స్పందిస్తూ... ‘‘అతణ్ని తిరిగి దేశానికి రప్పిస్తామని నమ్మకం నాకుంది. దానికో టైం రావాలి’’ అని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 250 స్థానాలు గ్యారెంటీ అని చెప్పిన రాజ్ నాథ్...సీఎం రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉండేందుకు బీఎస్పీ, ఎస్పీ-కాంగ్రెస్ లలో ఎవరుంటారో తేల్చుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.