యాప్నగరం

జనాన్ని హడలెత్తిస్తోన్న కేంద్ర హోం శాఖ హెచ్చరిక!

కేంద్రం హోం శాఖ ముందస్తు హెచ్చరికలు జనాలను హడలెత్తిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడతాయని అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ సూచించింది.

Samayam Telugu 4 May 2018, 7:10 pm
భారీ గాలులతో కూడిన అకాల వర్షాలు, పిడుగులతో యావత్ భారతావని హడలిపోతోంది. పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా.. గత రెండు రోజుల్లోనే ఐదు రాష్ట్రాల్లో 124 మంది చనిపోగా.. 300 మంది గాయపడ్డారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే 73 మంది బలయ్యారు. కాగా.. బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీల్లో శనివారం పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హోం శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఏపీల్లోనూ అక్కడక్కడా భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడతాయని హోం శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
Samayam Telugu thunderstorm


తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాజస్థాన్‌లో ధూళి తుఫాను, పిడుగులు పడే ప్రమాదం ఉందని హోం శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పిడుగుల కారణంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా దెబ్బతింది. రెండు రోజుల్లోనే 12 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. 2500 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో అనేక గ్రామాలు అంధకారంలో కూరుకుపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.