యాప్నగరం

ఇక లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే అంతే.. కేంద్రం తాజా కఠిన ఆదేశాలివే..

Home Secretary Ajay Bhalla: లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించే వారిపట్ల జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చని స్పష్టంటూ పేర్కొంటూ నిబంధనల జాబితాను కేంద్రం రాష్ట్రాలకు పంపించారు.

Samayam Telugu 2 Apr 2020, 10:52 pm
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ చాలా మంది బాధ్యత లేకుండా లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
Samayam Telugu corona lockdown


Also Read: కరోనా విరాళాల కోసం బండి సంజయ్ సరికొత్త ప్లాన్

ఏ నిబంధన ఉల్లంఘించిన వారిపై ఏ చర్య తీసుకోవాలనే విషయాన్ని చెబుతూ పూర్తి జాబితాను రాష్ట్రాలకు పంపించారు. లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించే వారిపట్ల జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చని స్పష్టంటూ పేర్కొంటూ నిబంధనల జాబితాను కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. ఈ జాబితా అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తే పడే శిక్షల గురించి ప్రజల్లో బాగా ప్రచారం కల్పించాలని కోరింది.

Also Read: లాక్‌డౌన్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5 వేలు.. సీఎం సంచలన నిర్ణయం

ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాత్రి ప్రకటించిన ప్రకారం మొత్తం కొవిడ్ కేసులు 2069 నమోదయ్యాయి. వీరిలో రికవరీ అయిన వారు 156 మంది ఉండగా, చనిపోయిన వారి సంఖ్య 53గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.