యాప్నగరం

నా ఇల్లు కమలం పార్టీకి పొదరిల్లు!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

Samayam Telugu 22 Jun 2017, 4:41 pm
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘మేరా ఘర్, బాజ్పాకా ఘర్’ (నా ఇల్లు ..బీజేపీ ఇల్లు) అంటూ ఇంటిగోడలపై రాసి ప్రచారం చేపట్టారు. అయితే ఆయా ఇండ్ల యజమానుల అనుమతి లేకుండానే బీజేపీ కార్యకర్తలు ఇలాంటి రాతలు రాస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. అత్యుత్సాహంతో కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తల ఇంటి గోడలపై కూడా ఇలాగే రాస్తున్నారు.
Samayam Telugu houses in mp painted as mera ghar bhajpa ka ghar
నా ఇల్లు కమలం పార్టీకి పొదరిల్లు!


అయితే ఈ రాతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కామెంట్ చేయడం లేదు కానీ.. స్థానిక నేతలు మాత్రం... బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ఇలా రాస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో రైతులు చేపట్టిన ఆందోళన శివరాజ్ సింగ్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తప్పించుకోవడానికే బీజేపీ ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.