ప్రముఖ హీరోయిన్ నయనతార, మధుబాల కారణంగా ఓ దొంగ కటకటాల వెనక్కి వెళ్లాడు. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజమే. కాకపోతే ఇక్కడ నయనతార నిజంగానే రంగంలోకి దిగలేదు, ఆమె ఫొటోను ఉపయోగించుకొని మధుబాల అనే పోలీస్ ఆఫీసర్ ఈ పని చేసింది. ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ స్టోరీలోకి వెళ్తే.. బిహార్లో సంజయ్ కుమార్ మహతో అనే బీజేపీ నేతకు చెందిన ఖరీదైన ఫోన్ను మహమ్మద్ హస్నైన్ అనే వ్యక్తి దొంగిలించాడు.
ఫోన్ పోవడంతో సంజయ్ కుమార్ దర్భంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేరున్న నాయకుడు కావడంతో ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకుని మధుబాల దేవి అనే ఏఎస్ఐకి అప్పగించారు. ఖరీదైన ఫోన్ను కొట్టేసిన సదరు దొంగ దాన్ని వాడేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దాని సాయంతో అతడెక్కడ ఉన్నాడో గుర్తించి పట్టుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ అతడు చిక్కినట్టే చిక్కి పారిపోయాడు.
దీంతో మధుబాల దేవికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే అతడికి ఫోన్లు చేయడం మొదలు పెట్టింది. మాటల్లో అతడి పట్ల ప్రేమ కురిపించేది. మనోడితో కలిసి ఉండాలని అనుకుంటున్నా అని, నువ్వు లేకపోతే నేను లేనని ఓ రేంజ్లో నటించింది. మొదట్లో హస్నైన్ ఆమెను పట్టించుకోలేదు. కానీ మధుబాల మాత్రం పట్టు వదల్లేదు. దీంతో నీ ఫొటో పంపు చూద్దాం అని చెప్పాడు. వెంటనే ఆమె దక్షిణాదిన పాపులర్ హీరోయిన్ అయిన నయనతార ఫొటోను పంపింది.
ఫొటో చూడగానే ఫిగర్ కత్తిలా ఉందని భావించిన హస్నైన్.. ఆమెను కలవడానికి అంగీకరించాడు. దీంతో దర్భంగా టౌన్లో ఓ చోట కలుసుకుందాం అని అనుకున్నారు. కోరి వచ్చిన అందమైన అమ్మాయిని కలవడానికి ఆతురతగా ఎదురు చూసిన అతడు పోలీసుల వలలో చిక్కాడు. నయనతార ఫొటో సాయంతో పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఏఎస్సై మధుబాల తనదైన స్టయిల్లో అడిగేసరికి తాను ఆ ఫోన్ కొట్టేయలేదని, మరో చోర మిత్రుడు కొట్టేసి తనకు ఇచ్చాడని చెప్పాడు. దాంతో అతణ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ను సదరు నేతకు తిరిగి అప్పగించారు. తెలివిగా దొంగను పట్టుకున్న మధుబాలకు రివార్డు ప్రకటించారు.
ఫోన్ పోవడంతో సంజయ్ కుమార్ దర్భంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేరున్న నాయకుడు కావడంతో ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకుని మధుబాల దేవి అనే ఏఎస్ఐకి అప్పగించారు. ఖరీదైన ఫోన్ను కొట్టేసిన సదరు దొంగ దాన్ని వాడేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దాని సాయంతో అతడెక్కడ ఉన్నాడో గుర్తించి పట్టుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ అతడు చిక్కినట్టే చిక్కి పారిపోయాడు.
దీంతో మధుబాల దేవికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే అతడికి ఫోన్లు చేయడం మొదలు పెట్టింది. మాటల్లో అతడి పట్ల ప్రేమ కురిపించేది. మనోడితో కలిసి ఉండాలని అనుకుంటున్నా అని, నువ్వు లేకపోతే నేను లేనని ఓ రేంజ్లో నటించింది. మొదట్లో హస్నైన్ ఆమెను పట్టించుకోలేదు. కానీ మధుబాల మాత్రం పట్టు వదల్లేదు. దీంతో నీ ఫొటో పంపు చూద్దాం అని చెప్పాడు. వెంటనే ఆమె దక్షిణాదిన పాపులర్ హీరోయిన్ అయిన నయనతార ఫొటోను పంపింది.
ఫొటో చూడగానే ఫిగర్ కత్తిలా ఉందని భావించిన హస్నైన్.. ఆమెను కలవడానికి అంగీకరించాడు. దీంతో దర్భంగా టౌన్లో ఓ చోట కలుసుకుందాం అని అనుకున్నారు. కోరి వచ్చిన అందమైన అమ్మాయిని కలవడానికి ఆతురతగా ఎదురు చూసిన అతడు పోలీసుల వలలో చిక్కాడు. నయనతార ఫొటో సాయంతో పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఏఎస్సై మధుబాల తనదైన స్టయిల్లో అడిగేసరికి తాను ఆ ఫోన్ కొట్టేయలేదని, మరో చోర మిత్రుడు కొట్టేసి తనకు ఇచ్చాడని చెప్పాడు. దాంతో అతణ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ను సదరు నేతకు తిరిగి అప్పగించారు. తెలివిగా దొంగను పట్టుకున్న మధుబాలకు రివార్డు ప్రకటించారు.