యాప్నగరం

పుట్టిన రోజు నాడే జవాన్ ప్రాణం తీసిన పాక్, బీఎస్ఎఫ్ దీటైన రిప్లై

పుట్టిన రోజు నాడే బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణం తీసిన పాకిస్థాన్‌కు భారత బలగాలు దిమ్మతిరిగే బదులిచ్చాయి.

TNN 4 Jan 2018, 1:33 pm
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోన్న పాకిస్థాన్ బుధవారం బీఎస్‌ఎఫ్ జవాన్‌ను బలి తీసుకుంది. బుధవారం పాక్ రేంజర్లు యథేచ్చగా కాల్పులకు తెగబడటంతో.. బీఎస్‌ఎఫ్‌ హెడ్ కానిస్టేబుల్ ఆర్పీ హజ్రా ప్రాణాలు వదిలాడు. సాంబా సెక్టార్ వద్ద పాక్ జరిపిన కాల్పుల్లో హజ్రా పుట్టిన రోజు నాడే తుది శ్వాస విడిచాడు. తొటి జవాన్ తమ కళ్ల ముందే మరణించడంతో తీవ్రంగా స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు.. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే బదులిచ్చాయి.
Samayam Telugu how bsf silenced pakistani guns last night after its jawan was killed on birthday
పుట్టిన రోజు నాడే జవాన్ ప్రాణం తీసిన పాక్, బీఎస్ఎఫ్ దీటైన రిప్లై


పాకిస్థాన్ తొలుత కాల్పులతో కవ్విస్తూ.. చిన్న చిన్న ఆయుధాలతో దాడి చేసింది. తర్వాత మోర్టార్ షెల్‌లను ప్రయోగించింది. తమ జవాన్‌ను పుట్టిన రోజు నాడే కోల్పోయిన కసితో ఉన్న బీఎస్ఎఫ్.. పాకిస్థాన్‌కు చెందిన రెండు మోర్టార్ పొజిషన్లను బుధవారం రాత్రి ధ్వంసం చేసింది. భారత కాల్పుల్లో 8 నుంచి 10 మంది పాక్ రేంజర్లు మరణించారని తెలుస్తోంది. బీఎస్ఎఫ్ తీవ్రంగా ప్రతిఘటించంతో కంగుతిన్న పాక్ తోక ముడిచింది. ఆర్ఎస్ పురా సెక్టార్లోని అర్నియా ప్రాంతంలో భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని కూడా బీఎస్ఎఫ్ మట్టుబెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.