యాప్నగరం

సముద్రంలో కొట్టుకుపోతున్న పడవ.. ఏడుగుర్ని కాపాడిన రెస్క్యూ టీమ్

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు.. ఒడ్డుకు రావడానికి ఇబ్బందులు.. ఏడుగుర్ని కాపాడిని రెస్క్యూ టీమ్.

Samayam Telugu 11 Oct 2018, 7:39 pm
తిత్లీ తుఫాన్ ఆంధ్ర, ఒడిశాలను వణికిస్తోంది. భీకర గాలులకు తోడు.. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రతో పాటూ ఒడిశాలోని కొన్ని జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. గోపాలపురం ప్రాంతంలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా చెట్లు నెలకొరిగి.. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు మూడు లక్షల మంది ప్రజల్ని ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్‌లు పునరావాస కేంద్రాలకు తరలించారు.
Samayam Telugu Titli


గోపాలపురం ఏరియాలో రాకాసి గాలులు తాకిడి ఎక్కువగా ఉంది. తుఫాన్ గురించి తెలియక కొందరు స్థానిక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో.. తిరిగి ఒడ్డుకు చేరుకోవడానికి నానా తంటాలు పడ్డారు. మరికాసేపట్లో ఒడ్డుకు చేరుకునే సమయంలో గాలుల తాకిడికి పడవ ఒరిగింది. వెంటనే అప్రమత్తమైన ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

తాడులో సాయంతో పడవలో ఉన్న మత్స్యకారుల్ని రెస్క్యూ టీమ్ జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చింది. ఆ పడవలో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. పడవ కాస్త అటు ఇటూ అయినా.. సముద్రంలో కొట్టుకుపోయేవారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను స్థానికులు కొందరు తమ మొబైల్స్‌లో బంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.