యాప్నగరం

ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

కరోనా వైరస్ దేశంలో స్వైరవిహారం చేస్తున్న వేళ.. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భౌతికదూరం నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి నిర్వహించుకోవాలని సూచించింది.

Samayam Telugu 23 Jul 2020, 3:05 pm
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ గురువారం మార్గదర్శకాలను జారీచేసింది. రాస్ట్ర రాజధానుల్లో ఉదయం 9.00 గంటలకు వేడుకలను నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తారని పేర్కొంది. అంతేకాదు, పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్ ఫాస్ట్‌కు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపింది. కరోనా అత్యవసర సమయంలో సేవలు అందించినవారిని వేడుకలకు అహ్వానించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని చెప్పింది.
Samayam Telugu స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Independence day celebrations


కరోనా వ్యాప్తి దృష్ట్యా భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కాకుండా చూడాలని తెలిపింది. ఇదే విధంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని వివరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలని సూచించింది. ఇక, అదే రోజు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహణపై నిర్ణయాన్ని గవర్నర్లకే వదలిపెట్టింది. ఈ విషయంలో పరిస్థితుల ఆధారంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

దేశంలో కరోనా రక్కసి విజృంభణ కొనసాగుతుండటంతో భౌతికదూరం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండరాదని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు 12.41 లక్షలకు చేరుకోగా.. దాదాపు 30వేల మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరణాల్లో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అమెరికా, బ్రెజిల్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.