పాకిస్థాన్.. ఈ పేరు చెబితే చాలు ఇప్పుడు భారత్లో ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారంతో రగిలిపోతోంది. యూరీలో భారత ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదులను ఉసిగొల్పి మన సైనికుల ప్రాణాలను బలిగొన్న ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దేశంలోని మెజార్టీ ప్రజలైతే.. ఏకంగా పాక్ పైకి సైనిక బలగాలను పంపాలని కోరుకుంటున్నారు. కానీ ఇది అనుకున్నంత తేలిగ్గా జరిగే పని కాదు. ఎందుకంటే ఉగ్రవాదులు భారత ఆర్మీపై దాడి చేస్తారని పాక్కు ముందే తెలుసు. దాంతో అది ఏ క్షణాన్నైనా యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉంది. ఒకవేళ రణ రంగంలోకి దిగితే.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే భారత వ్యూహకర్తలు ప్రత్యక్ష దాడికి వెనకాడుతున్నారు. స్వదేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాక్ పాలకులకు ప్రజల దృష్టిని మరల్చేందుకు యుద్ధం ప్రధాన ఆయుధంగా మారనుండగా.. భారత్కు మాత్రం యుద్ధం వల్ల నష్టాలే ఎక్కువ. వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థ అయిన భారత్ భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. యుద్ధం వల్ల ఈ పెట్టుబడులు వెనక్కి మళ్లే అవకాశం ఉంది. అదీ కాకుండా పాక్తో పూర్థి స్థాయి యుద్ధానికి అవకాశాలు కూడా తక్కువే. ఆ దేశంపై మనం తీవ్ర స్థాయిలో విరుచుకు పడకుండా ప్రపంచ దేశాలు అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అదీ కాదనుకుంటే రెండు దేశాలు కూడా అణ్వాయుధాలను కలిగి ఉన్నవే. పాక్ చేతిలో అణ్వస్త్రాలు ఉండటం అంటే పిచ్చోడి చేతిలో రాయి కంటే దారుణం. అందుకే యుద్ధం జోలికి పోకుండా.. పాక్ను ఏ రకంగా దారికి తెచ్చుకోవాలనే విషయమై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరి పాక్ను దెబ్బతీయడానికి మన దగ్గరున్న మార్గాలేంటి?
ఉగ్రవాదులను భారత్పైకి ఎగదోస్తున్న పాక్ను నియంత్రించడానికి భారత్కు సింధు జలాల ఒప్పందం రూపంలో ఓ ఆయుధం ఉంది. దీంతో పాక్ను కట్టడి చేయవచ్చు. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్కు నియంత్రణ లభించింది. ఐదు ఉపనదులతో కూడిన సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్కు జీవనరేఖ. ఏ మాత్రం సరైన పాలన లేకపోయినా, అధికార యంత్రాంగం విఫలమైనా, ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నా.. ప్రపంచంలోనే అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఆ దేశం సొంతం. దీనిపై దెబ్బ కొడితే ఆ దేశం ఉగ్రవాదులను ఎగదోయకుండా నిలువరించడం పెద్ద కష్టం కాబోదు. ‘సింధు జలాల ఒప్పందం’ మేరకు ఇరు దేశాల మధ్య నీటి పంపిణీ జరుగుతోంది. పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకొని భారీగా లబ్ధి పొందుతోంది. దీన్నే భారత్కు వ్యతిరేక వ్యూహంగానూ వాడుకుంటోంది. ఒక్కసారి నీటి విడుదల ఆపేసినా అంతర్జాతీయ సమాజం ముందు గోడు వెల్లబోసుకుంటోంది. దీంతో ప్రపంచ దేశాల ఒత్తిడితో ఆ దేశానికి మనం నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి.
సింధు నదీ వ్యవస్థలోని నదులను అనుసంధానించడం వల్ల పాక్ను ఈ విషయంలో ఇరకాటంలోకి నెట్టవచ్చు. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించడం వల్ల భారత్ నీటిని సమర్థవంతంగా వాడుకునే వీలుంది. కాకపోతే సింధు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల అంతర్జాతీయంగా భారత పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని, ఇది సరైందని కాదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. మిగతా పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది విషయంలో మనతో పోల్చుకుంటే చైనాకు అనుకూలతలు ఎక్కువ. నది ఎగువ భాగాన ఉన్న చైనా బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రాలను నిర్మిస్తోంది. వాటికి సంబంధించిన సమాచారమేదీ మనకు ఇవ్వడం లేదు. మనం కూడా సింధు నదుల విషయంలో అలా చేసే వీలున్నప్పటికీ... చైనా తరహాలో ఏకపక్షంగా వ్యవహరించలేం. కాకపోతే సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంలపై పాక్కే హక్కులు దఖలు పడినప్పటికీ.. తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ అవసరాల కోసం మనం కూడా ఆ నీటిని వాడుకునే వీలుంది. ఈ ఒప్పందం సక్రమంగా అమలు కావడం కోసం, వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఇండస్ వాటర్ కమిషన్తో సమావేశం కాకుండా ఉండటం ద్వారా పాక్ను ఇరుకున పెట్టవచ్చు. మన ముందున్న ఇంకో మార్గం.. నేరుగా తలదూరిస్తే ఇబ్బంది అని భావిస్తే.. ఆప్ఘాన్లో జన్మించిన కాబుల్ నది సింధు ఉపనది. ఇది 700 కి.మీ. పొడవునా ప్రవహించాక సింధు నదిలో కలుస్తోంది. సింధు బేసిన్లో భాగమైన ఆ నదిపై ఆప్ఘాన్లో డ్యామ్ల్లాంటి సదుపాయాలు కల్పిస్తే సరి. ఈ చర్య వల్ల పాక్లో సింధు నదీ ప్రవాహాన్ని నియంత్రించవచ్చు.
కేవలం జల ఒప్పందాల్ని ఉల్లంఘించడం ద్వారా మాత్రమే కాకుండా పాక్ ఆర్థిక మూలాలపై కూడా దెబ్బ కొట్టాలి. ఆ దేశంలో మెజార్టీ వ్యాపారాలు సైనికుల చేతిలో ఉన్నాయి. కాబట్టి పాక్ పాలనకు పరోక్ష కేంద్రమైన సైనిక వ్యవస్థను దెబ్బతీసేలా.. సైనికాధికారుల వ్యాపార లావాదేవీలను నియంత్రించాలి. చైనా ద్వారానే మనం ఈ పని చేయవచ్చు. నేరుగా మన ఎగుమతులను పాక్కు నిలిపివేయడం కాకుండా.. పాక్కు ఎగుమతులను తగ్గిస్తేనే మనదేశానికి మీ వస్తువులను దిగుమతి చేసుకుంటామని చెప్పడం ద్వారా చైనాను నియంత్రించవచ్చు. భారత్ లాంటి భారీ మార్కెట్ను చైనా వదులుకోలేదు. పాక్పై ఉగ్రవాద ముద్ర వేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి దాన్ని మరింత దూరం పెట్టాలి. ప్రపంచ దేశాల నుంచి ఆ దేశానికి ఆర్థిక సాయం అందకుండా చూడాలి. మనం బలమైన శక్తిగా ఎదుగుతూ.. తోటి ఇస్లామిక్ దేశాలను కూడా క్రమంగా పాక్కు దూరం చేయాలి. పాక్ ప్రజలకు అభివృద్ధి రుచి చూపించాలి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, ఆప్ఘాన్, ఇరాన్లు మనకు సహకరిస్తున్న రీతిలోనే మిగతా దేశాలను కూడా మన దారికి తెచ్చుకోవాలి. దీంతోపాటు అంతర్గతంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను తెలియకుండా ఏరేయాలి. ఇవన్నీ కార్య రూపం దాల్చడానికి, పాక్ చుట్టూ ఉచ్చు బిగించడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక అవసరం. దాాదాపు 70 ఏళ్లుగా సహనంతో ఉన్న భారతావని మరో ఐదేళ్లు కూడా ఓర్పుతో ఉండి, పాక్ చుట్టూ ఉచ్చు బిగిస్తే.. దాయాదికి దిమ్మ తిరగడం ఖాయం.
ఉగ్రవాదులను భారత్పైకి ఎగదోస్తున్న పాక్ను నియంత్రించడానికి భారత్కు సింధు జలాల ఒప్పందం రూపంలో ఓ ఆయుధం ఉంది. దీంతో పాక్ను కట్టడి చేయవచ్చు. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్కు నియంత్రణ లభించింది. ఐదు ఉపనదులతో కూడిన సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్కు జీవనరేఖ. ఏ మాత్రం సరైన పాలన లేకపోయినా, అధికార యంత్రాంగం విఫలమైనా, ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నా.. ప్రపంచంలోనే అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఆ దేశం సొంతం. దీనిపై దెబ్బ కొడితే ఆ దేశం ఉగ్రవాదులను ఎగదోయకుండా నిలువరించడం పెద్ద కష్టం కాబోదు. ‘సింధు జలాల ఒప్పందం’ మేరకు ఇరు దేశాల మధ్య నీటి పంపిణీ జరుగుతోంది. పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకొని భారీగా లబ్ధి పొందుతోంది. దీన్నే భారత్కు వ్యతిరేక వ్యూహంగానూ వాడుకుంటోంది. ఒక్కసారి నీటి విడుదల ఆపేసినా అంతర్జాతీయ సమాజం ముందు గోడు వెల్లబోసుకుంటోంది. దీంతో ప్రపంచ దేశాల ఒత్తిడితో ఆ దేశానికి మనం నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి.
సింధు నదీ వ్యవస్థలోని నదులను అనుసంధానించడం వల్ల పాక్ను ఈ విషయంలో ఇరకాటంలోకి నెట్టవచ్చు. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించడం వల్ల భారత్ నీటిని సమర్థవంతంగా వాడుకునే వీలుంది. కాకపోతే సింధు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల అంతర్జాతీయంగా భారత పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని, ఇది సరైందని కాదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. మిగతా పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నది విషయంలో మనతో పోల్చుకుంటే చైనాకు అనుకూలతలు ఎక్కువ. నది ఎగువ భాగాన ఉన్న చైనా బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రాలను నిర్మిస్తోంది. వాటికి సంబంధించిన సమాచారమేదీ మనకు ఇవ్వడం లేదు. మనం కూడా సింధు నదుల విషయంలో అలా చేసే వీలున్నప్పటికీ... చైనా తరహాలో ఏకపక్షంగా వ్యవహరించలేం. కాకపోతే సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంలపై పాక్కే హక్కులు దఖలు పడినప్పటికీ.. తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ అవసరాల కోసం మనం కూడా ఆ నీటిని వాడుకునే వీలుంది. ఈ ఒప్పందం సక్రమంగా అమలు కావడం కోసం, వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఇండస్ వాటర్ కమిషన్తో సమావేశం కాకుండా ఉండటం ద్వారా పాక్ను ఇరుకున పెట్టవచ్చు. మన ముందున్న ఇంకో మార్గం.. నేరుగా తలదూరిస్తే ఇబ్బంది అని భావిస్తే.. ఆప్ఘాన్లో జన్మించిన కాబుల్ నది సింధు ఉపనది. ఇది 700 కి.మీ. పొడవునా ప్రవహించాక సింధు నదిలో కలుస్తోంది. సింధు బేసిన్లో భాగమైన ఆ నదిపై ఆప్ఘాన్లో డ్యామ్ల్లాంటి సదుపాయాలు కల్పిస్తే సరి. ఈ చర్య వల్ల పాక్లో సింధు నదీ ప్రవాహాన్ని నియంత్రించవచ్చు.
కేవలం జల ఒప్పందాల్ని ఉల్లంఘించడం ద్వారా మాత్రమే కాకుండా పాక్ ఆర్థిక మూలాలపై కూడా దెబ్బ కొట్టాలి. ఆ దేశంలో మెజార్టీ వ్యాపారాలు సైనికుల చేతిలో ఉన్నాయి. కాబట్టి పాక్ పాలనకు పరోక్ష కేంద్రమైన సైనిక వ్యవస్థను దెబ్బతీసేలా.. సైనికాధికారుల వ్యాపార లావాదేవీలను నియంత్రించాలి. చైనా ద్వారానే మనం ఈ పని చేయవచ్చు. నేరుగా మన ఎగుమతులను పాక్కు నిలిపివేయడం కాకుండా.. పాక్కు ఎగుమతులను తగ్గిస్తేనే మనదేశానికి మీ వస్తువులను దిగుమతి చేసుకుంటామని చెప్పడం ద్వారా చైనాను నియంత్రించవచ్చు. భారత్ లాంటి భారీ మార్కెట్ను చైనా వదులుకోలేదు. పాక్పై ఉగ్రవాద ముద్ర వేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి దాన్ని మరింత దూరం పెట్టాలి. ప్రపంచ దేశాల నుంచి ఆ దేశానికి ఆర్థిక సాయం అందకుండా చూడాలి. మనం బలమైన శక్తిగా ఎదుగుతూ.. తోటి ఇస్లామిక్ దేశాలను కూడా క్రమంగా పాక్కు దూరం చేయాలి. పాక్ ప్రజలకు అభివృద్ధి రుచి చూపించాలి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, ఆప్ఘాన్, ఇరాన్లు మనకు సహకరిస్తున్న రీతిలోనే మిగతా దేశాలను కూడా మన దారికి తెచ్చుకోవాలి. దీంతోపాటు అంతర్గతంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను తెలియకుండా ఏరేయాలి. ఇవన్నీ కార్య రూపం దాల్చడానికి, పాక్ చుట్టూ ఉచ్చు బిగించడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి దాకా ఓపిక అవసరం. దాాదాపు 70 ఏళ్లుగా సహనంతో ఉన్న భారతావని మరో ఐదేళ్లు కూడా ఓర్పుతో ఉండి, పాక్ చుట్టూ ఉచ్చు బిగిస్తే.. దాయాదికి దిమ్మ తిరగడం ఖాయం.