యాప్నగరం

రైళ్లలో లభించే ఆహారం విషపూరితం: కాగ్

భారత రైల్వేలు ప్రయాణికులు అందించి ఆహార పదార్థాలు విషపూరితమని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్

TNN 21 Jul 2017, 11:17 am
భారత రైల్వేలు ప్రయాణికులు అందించి ఆహార పదార్థాలు విషపూరితమని, వాటిని మనుషులు తినలేరని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడయ్యింది. నాణ్యత లోపించిన ఆహారం, వంటకాలు వాడిన వస్తువులనే మళ్లీమళ్లీ వాడటం, గుర్తింపు లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల నీళ్ల బాటిళ్లు, తేదీ పూర్తయినా అమ్ముతున్న ఆహార పదార్థాలను విషపూరితమైనవని కాగ్ గుర్తించింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యతపై రూపొందించిన కాగ్ నివేదికను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
Samayam Telugu humans cannot have railways serving food cag report
రైళ్లలో లభించే ఆహారం విషపూరితం: కాగ్


రైల్వే శాఖలో తరచూ క్యాటరింగ్ పాలసీలు, అపరిశుభ్రత వల్లే ఈ పరిస్థితికి కారణమని కాగ్ తేల్చింది. రైళ్లల్లో అందించే ఆహారానికి బిల్లులు, మెను కార్డు కూడా ఇవ్వడం తేలింది. కాగ్ బృందం 74 రైల్వే స్టేషన్లు, 80 రైళ్లను పరిశీలించగా ఆహార పదార్థాలలో నాణ్యత లోపించడం, అపరిశుభ్రత పాటించకపోవడంలాంటివి గమనించింది. రైల్వే స్టేషన్లలో అమ్మే ఆహారపదార్థాలపై చీమలు, దోమలు ముసురు ముసురుతున్నాయని, స్వచ్ఛమైన తాగు నీరు కూడా అందించడం లేదని కాగ్ గుర్తించింది. ఆహార పదార్థాలపై సరియైన పర్యవేక్షణ లేకుండా పోయిందని కాగ్ నిర్ధరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.