జేబు దొంగల బారి నుంచి భార్యను కాపాడే క్రమంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (ఫిబ్రవరి 26) ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్య ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఓ యువకుడు తన భార్యతో కలిసి మరో ప్రాంతానికి బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు చెందిన బస్సు.. ప్రగతి మైదాన్ సమీపానికి చేరుకున్న సమయంలో ఇద్దరు పిక్పాకెటర్స్ యువకుడి మొబైల్ ఫోన్ తస్కరించి, రన్నింగ్ బస్సు నుంచి కిందకి దిగేశారు.
యువకుడి అరుపులతో అప్రమత్తమైన అతడి భార్య మరో ద్వారం ద్వారా కిందకి దిగి దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారిలో ఓ దుండగుడు ఆమెను కత్తితో పొడిచాడు. వెనకాలే పరుగెత్తుకొచ్చిన బాధితుడు తన భార్యను రక్షించే క్రమంలో దొంగలతో పెనుగులాటకు దిగాడు.
దొంగలిద్దరూ కలిసి యువకుణ్ని చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. యువకుడి ఛాతీలో బలంగా పిడిగుద్దులు కురిపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర ప్రయాణికులు ఆ దంపతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
యువకుడి అరుపులతో అప్రమత్తమైన అతడి భార్య మరో ద్వారం ద్వారా కిందకి దిగి దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారిలో ఓ దుండగుడు ఆమెను కత్తితో పొడిచాడు. వెనకాలే పరుగెత్తుకొచ్చిన బాధితుడు తన భార్యను రక్షించే క్రమంలో దొంగలతో పెనుగులాటకు దిగాడు.
దొంగలిద్దరూ కలిసి యువకుణ్ని చితకబాది అక్కడి నుంచి పారిపోయారు. యువకుడి ఛాతీలో బలంగా పిడిగుద్దులు కురిపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఇతర ప్రయాణికులు ఆ దంపతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.