యాప్నగరం

బాంబుపేలుళ్ల కేసు నిందితులకు మరణశిక్ష

దిల్‌సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల కేసు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది.

TNN 19 Dec 2016, 5:52 pm
దిల్‌సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. నిందితులను వారం క్రితమే
Samayam Telugu hyderabad twin bomb blasts case death penalty for five terrorists
బాంబుపేలుళ్ల కేసు నిందితులకు మరణశిక్ష

రంగారెడ్డి జిల్లాలోని ఎన్ఐఏ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి విధించే శిక్షను డిసెంబర్ 19న ప్రకటిస్తామని చెప్పి వాయిదా వేసింది. సోమవారం ఎన్‌ఐఏ కోర్టుకు దోషులను తీసుకొచ్చారు పోలీసులు. వారికి యావజ్జీవమా? లేక మరణశిక్షా? అని కోర్టు లోపల, బయల ఒకటే టెన్షన్ నెలకొంది. న్యాయమూర్తి వారికి మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పేలుళ్ల బాధితులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు. ఎన్ఐఏ కోర్టు తీర్పు ప్రతిని హైకోర్టుకు పంపించింది.

ఈ తీర్పు నేపథ్యంలో నగర పోలీసులు అప్రమతమయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దోషులను తీసుకెళ్లే చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసుల బలగాలు కాపలా కాస్తున్నాయి.

బాంబుపేలుళ్ల నిందితులును యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్, అజాజ్ షేక్ గా ఎన్ఐఏ గుర్తించింది. దోషుల్లో ప్రధాన నిందితుడైన సూత్రధారి రియాజ్ భత్కల్ తప్పించుకోగా మిగతా అయిదుగురు పట్టుబడ్డారు. రియాజ్ పాకిస్తాన్ లో ఉన్నట్టు ఎన్ఐఏ భావిస్తోంది.

ఉగ్రవాది యాసిన్ భత్కల్...

2013 ఫిబ్రవరి 21, దిల్ సుఖ్‌నగర్లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు రెండు చోట్ల బాంబులు పెట్టి పేల్చారు. ఆ రెండు ఘటనల్లో 19 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.