ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న వేళ దాని నుంచి కోలుకొనేందుకు అవలంబిస్తున్న చికిత్స విధానం గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మాత్ర బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కరోనా సోకిన రోగులకు ఈ మాత్ర బాగా పని చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మాత్రలు తమకు కావాలని ప్రధాని మోదీని ఫోన్ ద్వారా కోరారు. దీంతో ఈ ఔషధానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, తాజాగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) దీనిపై చేసిన ఓ కీలక ప్రకటన సంచలనం రేపుతోంది.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని కేవలం రోగనిరోధకత పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలని, అంతేకానీ, కొవిడ్-19 నివారణకు కానీ, చికిత్సకు కానీ కాదని ఐసీఎంఆర్ హెడ్ సైంటిస్ట్ రామన్ ఆర్.గంగాఖేడ్కర్ అన్నారు. ‘‘ఈ అంశంలో రెండు రకాల పరీక్షలు విదేశాల్లో జరిగాయి. కానీ, ఫలితాలు ఆశించినట్లుగా రాలేదు. కాబట్టి, ఇది మన దేశంలో కేవలం రోగనిరోధకత సాధనంగా మాత్రమే ఉపయోగించాలి, చికిత్సకు ఉపయోగించకూడదు. ’’ అని గంగాఖేడ్కర్ ఏఎన్ఐతో అన్నారు. ఈ ఔషధం కొవిడ్-19ను తగ్గిస్తున్నట్లయితే మేం దీన్ని ఇతరులకు వాడాలని సలహా ఇస్తామని అన్నారు. కానీ, రోగిపై దీని ప్రభావం ఫలితాలు తేలాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందువల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉన్నాయని వివరించారు.
Also Read: undefined
‘‘మనం దీన్ని సాధారణ జనాలకు అనుమతించకూడదు. వైద్యులకు కూడా ఇదే చెప్తున్నాం. ప్రజలు కూడా ఈ మందును సాధారణ ఔషధాల్లాగా తమంతతాముగా వేసుకోవడం ఆపాలి. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ. దీనిపై జరుగుతున్న పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు వస్తే, మేమే ప్రకటిస్తాం’’ అని గంగాఖేడ్కర్ వివరించారు. కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగికి మళ్లీ దాని బారిన పడతాడా లేదా అనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల నిల్వలు దేశంలో సరిపోను ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా కోరిక మేరకు ఈ ఔషధాలను భారత్ ఎగుమతి కూడా చేసింది.
Must Read: undefined
Must Read: రామ్ గోపాల్ వర్మకు మంత్రి కేటీఆర్ అదిరే పంచ్
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని కేవలం రోగనిరోధకత పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలని, అంతేకానీ, కొవిడ్-19 నివారణకు కానీ, చికిత్సకు కానీ కాదని ఐసీఎంఆర్ హెడ్ సైంటిస్ట్ రామన్ ఆర్.గంగాఖేడ్కర్ అన్నారు. ‘‘ఈ అంశంలో రెండు రకాల పరీక్షలు విదేశాల్లో జరిగాయి. కానీ, ఫలితాలు ఆశించినట్లుగా రాలేదు. కాబట్టి, ఇది మన దేశంలో కేవలం రోగనిరోధకత సాధనంగా మాత్రమే ఉపయోగించాలి, చికిత్సకు ఉపయోగించకూడదు. ’’ అని గంగాఖేడ్కర్ ఏఎన్ఐతో అన్నారు. ఈ ఔషధం కొవిడ్-19ను తగ్గిస్తున్నట్లయితే మేం దీన్ని ఇతరులకు వాడాలని సలహా ఇస్తామని అన్నారు. కానీ, రోగిపై దీని ప్రభావం ఫలితాలు తేలాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందువల్ల కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉన్నాయని వివరించారు.
Also Read: undefined
‘‘మనం దీన్ని సాధారణ జనాలకు అనుమతించకూడదు. వైద్యులకు కూడా ఇదే చెప్తున్నాం. ప్రజలు కూడా ఈ మందును సాధారణ ఔషధాల్లాగా తమంతతాముగా వేసుకోవడం ఆపాలి. ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ. దీనిపై జరుగుతున్న పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు వస్తే, మేమే ప్రకటిస్తాం’’ అని గంగాఖేడ్కర్ వివరించారు. కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగికి మళ్లీ దాని బారిన పడతాడా లేదా అనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల నిల్వలు దేశంలో సరిపోను ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా కోరిక మేరకు ఈ ఔషధాలను భారత్ ఎగుమతి కూడా చేసింది.
Must Read: undefined
Must Read: రామ్ గోపాల్ వర్మకు మంత్రి కేటీఆర్ అదిరే పంచ్