యాప్నగరం

నేను బాగానే ఉన్నా: వెంకయ్య నాయుడు

Vice President: కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

Samayam Telugu 1 Oct 2020, 12:27 am
న ఆరోగ్యం బాగానే ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కరోనా వైరస్‌ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నానని వెల్లడించారు. మాల్దీవులు ఉపాధ్యక్షుడు ఫైజల్‌ నసీం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. వెంకయ్య నాయుడు ఈవిధంగా పేర్కొన్నారు. తాను త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Samayam Telugu వెంకయ్య నాయుడు
Venkaiah Naidu


ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన కార్యాలయం మంగళవారం (సెప్టెంబర్ 29) రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం రొటీన్‌గా కరోనా పరీక్షలు చేయించుకున్నప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన సతీమణి ఉషా నాయుడుకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.

వెంకయ్య నాయుడుకి కొవిడ్-19 బారిన పడ్డారనే విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఫైజల్‌ నసీం కూడా వెంకయ్య ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. వెంకయ్య దీనికి బదులిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ఆరోగ్యం విషయంలో మీరు చూపిన చొరవ నన్ను కదిలించింది’ అని వెంకయ్య నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: ఇక మందిర నిర్మాణం కోసమే ఎదురుచూస్తున్నా.. జై శ్రీరామ్: అద్వానీ
Don't Miss: కేరళకు ఏమైంది.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.