యాప్నగరం

పార్టీ అధినేతను నేనే, అఖిలేష్ సీఎం మాత్రమే

సమాజ్‌వాదీ పార్టీలో వివాదం నానాటికీ ముదురుతోన్న నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

TNN 8 Jan 2017, 7:17 pm
ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుణ్ని తానేనని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించుకున్నారు. నేను పార్టీ అధినేతను, అఖిలేష్ యాదవ్ కేవలం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే అని ములాయం స్పష్టం చేశారు. నా తమ్ముడు శివపాల్ యాదవే ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ పార్టీ చీఫ్ అని నేతాజీ పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ పార్టీ సభ్యులతో లక్నోలో జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా అఖిలేష్ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని రాంగోపాల్ ప్రకటించారు.
Samayam Telugu i am the national president of the samajwadi party asserts mulayam singh yadav
పార్టీ అధినేతను నేనే, అఖిలేష్ సీఎం మాత్రమే


కానీ ఆదివారం ములాయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాంగోపాల్ నిర్వహించిన సమావేశం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. డిసెంబర్ 30నే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆరేళ్లపాటు సస్పెషన్ వేటు పడిన వ్యక్తి పార్టీ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ములాయం ప్రశ్నించారు. మేం నేతాజీ వెంటే ఉంటామని ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందని, కాబట్టి పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని అఖిలేష్ యాదవ్ వర్గం ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరింది. కాగా, ఎమ్మెల్యేల సంతకాలను అఖిలేష్ వర్గం ఫోర్జరీ చేసిందని అమర్ సింగ్ ఆరోపించారు. పార్టీ సింబల్ విషయమై ములాయం వర్గం సోమవారం మధ్యాహ్నం ఈసీని కలవనుందని తెలుస్తోంది. ఇప్పటికే యూపీలో ఎన్నికల ప్రకటన వెలువడగా.. అధికార సమాజ్‌వాదీ పార్టీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.