యాప్నగరం

భారతావనికి సీఐఏ మాజీ చీఫ్ కితాబు

బెలుచిస్తాన్లో తీవ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని, ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు బెలూచీలు చేస్తున్న పోరాటానికి భారత్ అండదండలు అందిస్తోందని పాక్ అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న ఆరోపణలకు డేవిడ్ వ్యాఖ్యలతో చెక్ పడినట్లు అయింది.

TNN 19 Jan 2018, 12:36 pm
తీవ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తున్నట్లు కనీసం ఆరోపణలను కూడా తన మూడు దశాబ్దాల కెరీర్లో ఎనాడు వినలేదని సీఐఏ మాజీ డైరెక్టర్ డేవిడ్ అన్నారు. సీఐఏ డైరెక్టర్ గానే కాకుండా ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న'ఇంటర్ నేషనల్ సెక్యరిటీ అసిస్టెన్స్ ఫోర్స్' డైరెక్టర్ గా పనిచేసిన డేవిడ్ చేసిన వ్యాఖ్యలు దాయాది దేశం పాకిస్తాన్ కు చెంపపెట్టుగా మారాయి. బెలుచిస్తాన్లో తీవ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని, ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు బెలూచీలు చేస్తున్న పోరాటానికి భారత్ అండదండలు అందిస్తోందని పాక్ అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న ఆరోపణలకు డేవిడ్ వ్యాఖ్యలతో చెక్ పడినట్లు అయింది. ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న కులభూషన్ జాదవ్ ను కిడ్నాప్ చేసి బెలుచిస్తాన్లో అరెస్టు చేసినట్లు నాటకం ఆడుతున్న పాకిస్తాన్ కు డేవిడ్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారనున్నాయి.
Samayam Telugu i have never once heard the term indian state sponsored terrorism former cia director david petraeus
భారతావనికి సీఐఏ మాజీ చీఫ్ కితాబు


భారత గూడఛారిగా... బెలుచిస్తాన్ తీవ్రవాదులకు సాయం చేస్తున్నారనే నెపం మోపి జాదవ్ కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఇటు భారత్ లో తీవ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ కు అందిస్తున్న ఆర్థిక సాయంలో అమెరికా ఈ మధ్య భారీ కోత విధించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐఏ మాజీ ఛీప్ డేవిడ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.