నోట్లరద్దు నుంచి ఇప్పటి వరకు దేశంలో 400 బినామీ లావాదేవీలు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.600కోట్ల ఆస్తులు జప్తు చేశారు. 240 కేసులు నమోదు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
బినామీ లావాదేవీల నియంత్రణ సవరణ చట్టం-2016 గతేడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఐటీ శాఖ గతవారం దేశవ్యాప్తంగా 24 బినామీ ప్రొహిబిషన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇతరుల పేరు మీద (బినామీ) ఆస్తులు కూడబెట్టడం, చట్ట వ్యతిరేకంగా లావాదేవీలు చేయడంపై ఐటీ కన్నేసింది. ఇందులో స్థిర, చర ఆస్తులను పరిగణనలోకి తీసుకొని అధికారులు కేసులు నమోదు చేసింది.
ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 400లకు పైగా బీనామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇందులో బ్యాంకు అకౌంట్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు వారు వెల్లడించారు. 240 కేసులు నమోదు చేసిన అధికారులు రూ.600కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
కలకత్తా, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో రూ.530కోట్ల విలువ గల ఆస్తులు జప్తు చేశారు. ఈ రాష్ట్రాల్లో 40 కేసులు నమోదయ్యాయి.
జబల్ పూర్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి పేర రూ.7.7కోట్ల విలువైన భూములున్నట్లు అధికారులు గుర్తించారు.
బినామీ లావాదేవీల నియంత్రణ సవరణ చట్టం-2016 గతేడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఐటీ శాఖ గతవారం దేశవ్యాప్తంగా 24 బినామీ ప్రొహిబిషన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇతరుల పేరు మీద (బినామీ) ఆస్తులు కూడబెట్టడం, చట్ట వ్యతిరేకంగా లావాదేవీలు చేయడంపై ఐటీ కన్నేసింది. ఇందులో స్థిర, చర ఆస్తులను పరిగణనలోకి తీసుకొని అధికారులు కేసులు నమోదు చేసింది.
ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 400లకు పైగా బీనామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇందులో బ్యాంకు అకౌంట్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు వారు వెల్లడించారు. 240 కేసులు నమోదు చేసిన అధికారులు రూ.600కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
కలకత్తా, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో రూ.530కోట్ల విలువ గల ఆస్తులు జప్తు చేశారు. ఈ రాష్ట్రాల్లో 40 కేసులు నమోదయ్యాయి.
జబల్ పూర్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి పేర రూ.7.7కోట్ల విలువైన భూములున్నట్లు అధికారులు గుర్తించారు.