యాప్నగరం

మాజీ సీఎంపై కేసు నమోదు చేసిన ఐటీ విభాగం

విదేశాల్లోని ఆస్తులపై పన్ను ఎగవేత కేసులో మాజీ ముఖ్యమంత్రిపై ఆదాయపన్ను విభాగం కేసు నమోదు చేసింది. గతంలో ఈడీ ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసింది.

TNN 3 Dec 2016, 9:48 am
విదేశాల్లోని ఆస్తులపై పన్ను ఎగవేత కేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై ఆదాయపన్ను విభాగం కేసు నమోదు చేసింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో గత జూన్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమరీందర్ కుమారుడు రణీందర్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకు ఖాతాతోపాటు సహా పన్నుల బాధలేని దేశాలకు తరలించిన నిధులు ఎక్కడివని ఈడీ ప్రశ్నించింది. అమరీందర్‌పై ఐటీ విభాగం కేసు, ఆయన కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేయడం.. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందా అనే విషయం తేలాల్సి ఉంది.
Samayam Telugu i t files case complaint against punjab cm captain amarinder singh
మాజీ సీఎంపై కేసు నమోదు చేసిన ఐటీ విభాగం


తన కుమారుడికి ఈడీ సమన్లను జారీ చేయడం కక్ష సాధింపేనని, దాని వెనుక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హస్తం ఉందని అమరీందర్ ఆరోపించారు. అది తప్పుడు నోటీసని సీఎం స్పష్టం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీ 90 వేల ఓట్ల తేడాతో అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే సట్లజ్ యమునా కాలువ అనుసంధానం విషయంలో సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ అమరీందర్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయనే దిశానిర్దేశం చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.