యాప్నగరం

పద్మభూషణ్ వచ్చిందని తెలియగానే షాకయ్యా: బచేంద్రి పాల్

70వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముగ్గురికి భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి గౌరవించింది. మొత్తం 112 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 26 Jan 2019, 4:31 pm
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. విశిష్ట సేవలందించిన ముగ్గురికి భారతరత్నను, 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కొందరికి ఆ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ పర్వతారోహకురాలు బచేంద్రి పాల్‌కు దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను ప్రకటించి గౌరవించారు.
Samayam Telugu Bachendri Pal


తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై బచేంద్రి పాల్ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను పద్మభూషన్ అవార్డు వరించింది అని తెలియగానే షాకయ్యాను. అవార్డు వచ్చిందని ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యాను. నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నేను ఇప్పటివరకూ ఏ అవార్డు కోసం నా పేరు దరఖాస్తు చేసుకోలేదు. ఈ అత్యున్నత అవార్డును నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని’ చెప్పారు.

ఎవరీ బచేంద్రి పాల్..
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు. 1954లో ఉత్తరకాశిలోని అతిచిన్నగ్రామంలో కిషన్‌సింగ్‌ పాల్‌, హన్సాదేవి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ధైర్యంగల అమ్మాయిగా గుర్తింపు. పర్వతారోహణపై ఆసక్తితో నెహ్రూఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనింగ్‌లో చేరారు. ప్రాక్టీస్ అనంతరం 1982లో 21,900 అడుగుల ఎత్తు ఉన్న గంగోత్రిని, 19,091 అడుగుల ఎత్తు ఉన్న రుద్రగిరిని అదిరోహించారు. 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా.. ప్రపంచంలో 5వ మహిళగా ప్రసిద్ధి.

కాగా, దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్‌, భూపెన్‌ హజారికాలకు శుక్రవారం (జనవరి 25) రాత్రి ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేష సేవలందించినందుకుగాను ఈ ఏడాదికి నలుగురికి పద్మవిభూషణ్‌, 14 మందికి పద్మభూషణ్‌, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించి గౌరవించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది నలుగురు వ్యక్తులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.