యాప్నగరం

పార్టీని ముక్కలు కానివ్వను: ములాయం సింగ్

సమాజ్ వాదీ పార్టీ చీలిపోకుండా కాపాడటమే తన ముందున్న లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు

TNN 11 Jan 2017, 2:35 pm
సమాజ్ వాదీ పార్టీ చీలిపోకుండా కాపాడటమే తన ముందున్న లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తానుగానీ, తన తమ్ముడు శివపాల్ గానీ వేరే రాజకీయపార్టీ పెట్టే యోచనే తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu i will not let sp split says mulayam singh yadav
పార్టీని ముక్కలు కానివ్వను: ములాయం సింగ్


తండ్రీ ములాయం, తనయుడు అఖిలేష్ ల మధ్య ఆధిపత్య పోరు ఇంకా ఓ కొలక్కిరాలేదు. తండ్రీని విబేధించి తనదే అసలైన ఎస్పీ అని ప్రకటించుకున్న అఖిలేష్..సైకిల్ గుర్తు కూడా తమకే కేటాయించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అటు ములాయం సైతం ఈసీని కలిశారు.

‘‘పార్టీని ఐక్యంగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. మీరు ఎలాంటి శ్రమపడకుండానే ఎస్పీని స్థాపించా. నేనెవ్వరి పేరు చెప్పలేను కానీ కొంత మందిని పార్టీ చీల్చడానికి కుట్ర పన్నుతున్నారు’’ అని ములాయం బుధవారం నేతలతో వాపోయారు.

తన తమ్ముడు శిశపాల్ యాదవ్ పార్టీ బలోపేతానికి ఎంతో శ్రమించాడని, దేశంకోసం పోరాడారని ములాయం పునరుద్ఘాటించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లాడని గుర్తు చేశారు. ‘‘నా దగ్గర ఏమీ లేదు. మిగిలిందంతా పార్టీ కార్యకర్తలే’’ అని ములాయం అన్నారు.

‘‘నేను వారికి (అఖిలేష్ వర్గం) ఎన్నోసార్లు నచ్చజెప్పా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పార్టీ చీలిపోకుండా చూస్తా’’ అని ములాయం స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.