నా ఫోన్ నంబర్కు ఆధార్ లింక్ చేయను..
తన ఫోన్ నంబర్కు ఆధార్ను జతపరిచే సమస్యే లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్కతాలో బుధవారం (అక్టోబర్ 25) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫోన్ నంబర్కు ఆధార్ లింక్ చేయను.. కావాలంటే వాళ్లు నా ఫోన్ను డిస్కనెక్ట్ చేసుకోవచ్చు’ అని తేల్చి చెప్పారు.
TNN 25 Oct 2017, 7:26 pm
తన ఫోన్ నంబర్కు ఆధార్ను జతపరిచే సమస్యే లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్కతాలో బుధవారం (అక్టోబర్ 25) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫోన్ నంబర్కు ఆధార్ లింక్ చేయను.. కావాలంటే వాళ్లు నా ఫోన్ను డిస్కనెక్ట్ చేసుకోవచ్చు’ అని తేల్చి చెప్పారు. 2018 మార్చి 31లోగా ఫోన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివిధ సేవలను పొందడానికి ఆధార్ తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని 30వ తేదీన పరిశీలించనుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నవంబర్ 8న బ్లాక్ డే నిర్వహించనున్నట్లు మమత చెప్పారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకున్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నవంబర్ 8న బ్లాక్ డే నిర్వహించనున్నట్లు మమత చెప్పారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.