యాప్నగరం

హైవేపై దిగిన యుద్ధ విమానాలు!

భారత యుద్ధ విమానాలు రోడ్డెక్కాయి. భారత వాయుసేనకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయ్యి మళ్లీ టేకాఫ్ తీసుకున్నాయి.

TNN 24 Oct 2017, 11:56 am
భారత యుద్ధ విమానాలు రోడ్డెక్కాయి. భారత వాయుసేనకు చెందిన సుమారు 20 యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయ్యి మళ్లీ టేకాఫ్ తీసుకున్నాయి. వీటిలో మిరేజ్-2000, సుఖోయ్-30 ఎంకేఐ జెట్ విమానాలతో పాటు సి-130జె సూపర్ హెర్య్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ప్లేన్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు 65 కిలోమీటర్ల దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌ వద్ద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలను చేపట్టింది.
Samayam Telugu iaf jets land on lucknow agra expressway
హైవేపై దిగిన యుద్ధ విమానాలు!


లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై అధికారికంగా నిర్వహించిన తొలి వాయుసేన విన్యాసాలు ఇవి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో వాయుసేన ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు ల్యాండ్ అవడానికి వీలుగా ఈ హైవేను నిర్మించారు. యుద్ధ సమయాల్లో అత్యవసరంగా పరిస్థితుల్లో ప్రజా రవాణాకు వాడే రోడ్లకు ఉపయోగించుకోవడమే దీని ఉద్దేశం. ఈ మేరకు మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రటకన ఆధారంగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మొత్తం 20 విమానాలు (ఫైటర్, ట్రాన్స్‌పోర్ట్) ఎక్స్‌ప్రెస్‌వేపై దిగుతాయి. వీటిలో మిరేజ్-2000, జాగ్వార్, సుఖోయ్, ఎన్-32, సి-130జె ట్రాన్స్‌పోర్ట్ విమానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో 35 టన్నుల సి-130 సూపర్‌ హెర్క్యులస్‌ విమానం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గరుడ్‌ కమాండోలను సంక్షోభ ప్రాంతాలకు తరలించే విన్యాసాల్లో భాగంగా ఈ భారీ విమానం ల్యాండ్‌ అయ్యింది. ఇంత పెద్ద యుద్ధ విమానాన్ని రోడ్డుపై చూసేసరికి అక్కడున్న సామాన్య ప్రజలు కేరింతలు కొట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.