యాప్నగరం

కన్నబిడ్డను చూసేందుకు.. ఢిల్లీ బయల్దేరుతున్న అభినందన్ తల్లిదండ్రులు

తమ కన్నబిడ్డను చూడటం కోసం అభినందన్ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. పాక్ చెర నుంచి విముక్తి పొందుతున్న అభినందన్‌కు కళ్లారా చూడటం కోసం వారు ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు.

Samayam Telugu 28 Feb 2019, 10:14 pm
పాక్ ఆర్మీ చెర నుంచి విడుదల కాబోతున్న తమ కన్నబిడ్డను చూసేందుకు అభినందన్ తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారు. దేశ రక్షణలో భాగంగా శత్రువు చేతికి చిక్కిన తమ బిడ్డను చూడటం కోసం వారు చెన్నై నుంచి గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను శుక్రవారం భారత్ పంపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాఘా సరిహద్దులో అతణ్ని పాకిస్థాన్ సైన్యం భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.
Samayam Telugu Abhinandan-Varthaman1


ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన తర్వాత అభినందన్ నడిపిన మిగ్-21 బైసన్ కూడా పీవోకేలో కూలిపోయింది. పారాచ్యూట్ సాయంతో కిందకు దిగిన అతణ్ని స్థానికులు పట్టుకొని తర్వాత సైన్యానికి అప్పగించారు.

అభినందన్ తండ్రి వర్థమాన్ కూడా గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. ఆయన ఎయిర్ మార్షల్‌గా పదవీ విరమణ చేశారు. కార్గిల్ యుద్ధంలో గ్వాలియర్ నుంచి వైమానిక దళానికి ఆయన సారథ్యం వహించారు. అభినందన్ భార్యకు కూడా ఎయిర్‌ఫోర్స్‌తో అనుబంధం ఉంది. తన్వీ మర్వాహా కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలటే. ఈమె ర్యాంక్ స్క్వాడ్రన్ లీడర్. అభినందన్, తన్వీ ఒకే బ్యాచ్‌కు చెందిన పైలట్లు. వీరికి ఒక మగబిడ్డ సంతానం. పెళ్లి తరవాత తన్వీ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.