యాప్నగరం

ప్రజాప్రయోజనాలకే పెద్ద పీట వేయండి

ఐఎఎస్ అధికారుల అంతిమ లక్ష్యం ప్రజాప్రయోజనాలే కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు

TNN 1 Sep 2016, 5:52 pm
ఐఎఎస్ అధికారుల అంతిమ లక్ష్యం ప్రజాప్రయోజనాలే కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. 118వ ఐఎఎస్ ట్రెయినీల బృందానికి ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోడీ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల వ్యవస్థ (ఐఎఎస్)ను అత్యున్నత పౌర పరిపాలనా వ్యవస్థగా పేరొందిందని గుర్తుచేశారు. ఐఎఎస్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా ట్రెయినీ ఐఎఎస్ లకు ఈ తరహా ఇండక్షన్ ట్రైనింగులను 2007 నుండి ప్రారంభించారు. అత్యున్నత పదవుల్లోని అధికారులకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై వివిధ జాతీయ, అంతర్జాతీయ శిక్షణ సంస్థల ద్వారా వారికి శిక్షణ ఇస్తున్నారు.
Samayam Telugu ias trainees call on pm modi
ప్రజాప్రయోజనాలకే పెద్ద పీట వేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.