యాప్నగరం

స్వదేశీ కరోనా టెస్ట్‌ కిట్‌ రెడీ.. 20 నిమిషాల్లోనే ఫలితం

Delhi: కరోనా వైరస్‌ను నిర్ధారించడానికి స్వదేశీ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఆస్కార్ మెడికేర్ సంస్థ రూపొందించిన ఈ కిట్‌తో కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం రానుంది. ధర కూడా తక్కవే.

Samayam Telugu 26 Aug 2020, 9:52 pm
రోనా మహమ్మారితో అలుపెరుగని పోరు సాగిస్తున్న భారత్.. ఈ వైరస్‌ను గుర్తించడానికి స్వదేశీ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. అంతేకాదు.. ఈ పరీక్ష ద్వారా కొవిడ్-19 నిర్ధారణ మరింత వేగంగా, సులభతరంగా చేయవచ్చని కిట్‌ను ఉత్పత్తి చేసిన సంస్థ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ‘ఆస్కార్ మెడికేర్’ సంస్థ దీన్ని రూపొందించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దీనికి ఆమోదం తెలిపింది. భారతదేశ మొట్టమొదటి అధికారిక కొవిడ్-19 టెస్ట్‌ కిట్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ కిట్ ధర కూడా తక్కువే కావడం విశేషం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
India Coronavirus Testing Kit by Oscar Medicare, Delhi (Representational Image)


ఆస్కార్‌ మెడికేర్‌ సంస్థ ఇప్పటికే హెచ్‌ఐవీ, మలేరియా, డెంగ్యూ పరీక్ష కిట్ల తయారీ ద్వారా గుర్తింపు సాధించింది. దేశంలోని మూడు చోట్ల ఈ కిట్లను తయారుచేస్తోంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 ‘పాయింట్‌ ఆఫ్‌ కేర్‌’ (పీఓసీ) కిట్‌.. మానవుడిలో SARS-CoV-2 వైరస్ ఉనికిని 20 నిమిషాల్లోనే గుర్తించి ఫలితాలను అందించగలదని ఆస్కార్ మెడికేర్ సీఈవో ఆనంద్ సిక్రీ పేర్కొన్నారు.

ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ధర సుమారు రూ.200 ఉంటుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌లో రెండు లక్షల టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కిట్ల ఉత్పత్తిలో ఆస్కార్ మెడికేర్‌కు అంతకు ఎన్నో రేట్ల సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. కిట్ల మార్కెటింగ్‌ కోసం తమ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు.

Don't Miss: జుట్టు కత్తిరిస్తే చచ్చిపోతాడట.. 82 ఏళ్లు అలాగే వదిలేశాడు, చివరికి!

Also Read: లక్కీ గాళ్.. క్లాసులు వింటూనే రూ.25 కోట్లు దక్కించుకుంది

Must Read: నిండుకుండలా నాగార్జున సాగర్.. గేట్లు ఎత్తి నీటి విడుదల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.