యాప్నగరం

అది మోదీ వల్లే సాధ్యం: మెహబూబా ముఫ్తీ

కశ్మీర్ సమస్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే పరిష్కరించగలరని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం వెల్లడించారు.

TNN 6 May 2017, 7:37 pm
కశ్మీర్ సమస్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే పరిష్కరించగలరని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం వెల్లడించారు. అశాంతి నుంచి కశ్మీర్‌ను బయటపడేసే శక్తి ఆయనకు మాత్రమే ఉందని ఆమె కొనియాడారు. కశ్మీర్‌పై మోదీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దేశం మొత్తం ఆయన వెంట ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూలో శనివారం ఓ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన ముఫ్తీ అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.
Samayam Telugu if anyone can resolve kashmir problem it is pm modi mehbooba
అది మోదీ వల్లే సాధ్యం: మెహబూబా ముఫ్తీ


2015 డిసెంబర్ 25న జరిగిన మోదీ లాహోర్ పర్యటనపై కూడా ముఫ్తీ స్పందించారు. లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలవాలన్న మోదీ నిర్ణయం ఆయన సామర్థ్యానికి చిహ్నమని, అంతేకానీ అది మోదీ బలహీనత కాదని చెప్పారు. మోదీకి ముందున్న ప్రధాని పదేళ్లలో పాకిస్థాన్ వెళ్లే ధైర్యం చేయలదని మన్మోహన్ సింగ్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ రెండు దాయాది దేశాల మధ్య ఉన్న ఘర్షణలను ముగింపు పలకడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని మెహబూబా చెప్పారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.