యాప్నగరం

పేరెంట్స్‌ను చూడకపోతే శాలరీ కట్!

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.

Samayam Telugu 8 Feb 2017, 6:09 pm
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం అండగా నిలిచింది. కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని సర్కార్ నౌకర్లపై కొరడా ఝుళిపించనుంది. వయసు మీదబడిన పేరెంట్స్ బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి నెలనెలా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్టం చేయాలని నిర్ణయించింది. అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రకటన చేశారు.
Samayam Telugu if parents not looked after salaries would cut assam govts new law
పేరెంట్స్‌ను చూడకపోతే శాలరీ కట్!



2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం బాధ్యత అని లేనిపక్షంలో ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుని సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అతని తల్లిదండ్రులకు ఇస్తుందని హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.