రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా లోక్సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెహ్రూ కాలం నుంచి యూపీఏ హయాం వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ఆయన ఎత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల వల్ల 125 కోట్ల మంద్రి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ను దేశానికి తొలి ప్రధానిగా చేసి ఉంటే.. కశ్మీర్ పూర్తిగా మనదై ఉండేదని మోదీ అభిప్రాయపడ్డారు.
తమిళనాడు, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అరచకాలు చేసిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యమంటూ విపక్షానికి హితవు పలికారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మోదీ ఘాటుగా విమర్శించారు.
యూపీఏలో జరిగిన అభివృద్ధి కంటే ఎన్డీయే హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. యూపీఏ హయాంలో రోజుకు సగటున 11 కి.మీ. రోడ్లు నిర్మిస్తే మేం 22 కి.మీ. మే నిర్మిస్తున్నామన్నారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నామని చెప్పారు. మేం మాట్లాడుతుంటే గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు, మా మాటలు వినేందుకు ధైర్యం కావాలని తన ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్ష నేతలకు చురకలు అంటించారు.
మేం అధికారంలో వచ్చాక ఆధార్ను తొలగిస్తామన్నారు. కానీ ఆధార్తో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ప్రధాని తెలిపారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో కోటి మందికిపైగా ఉపాధి కల్పించామని ప్రధాని చెప్పారు. పంటకు గిట్టుబాట ధర కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశ జనాభాలో 20 శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేదన్నారు. దేశంలో ప్రతి మూలకు విద్యుత్ సరఫరా జరిగేలా పథకం రూపొందించామన్నారు.
కర్ణాటకలో రైల్వే గురించి మల్లిఖార్జున ఖర్గే చేసిన విమర్శలపై మోదీ దీటుగా బదులిచ్చారు. బీదర్-కలబుర్గి రైల్వే లైన్ ఎవరి హయాంలో పట్టాలెక్కిందో నిజం చెప్పాలన్నారు. ఆ ప్రాజెక్ట్కు వాజ్పేయి ప్రభుత్వం 2004లో ఆమోదం తెలిపింది. 2013 వరకూ మీరేం చేయలేదు. యడ్యూరప్ప అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రారంభం అయ్యాయని మోదీ గుర్తు చేశారు.
తమిళనాడు, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అరచకాలు చేసిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యమంటూ విపక్షానికి హితవు పలికారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మోదీ ఘాటుగా విమర్శించారు.
యూపీఏలో జరిగిన అభివృద్ధి కంటే ఎన్డీయే హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. యూపీఏ హయాంలో రోజుకు సగటున 11 కి.మీ. రోడ్లు నిర్మిస్తే మేం 22 కి.మీ. మే నిర్మిస్తున్నామన్నారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నామని చెప్పారు. మేం మాట్లాడుతుంటే గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు, మా మాటలు వినేందుకు ధైర్యం కావాలని తన ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్ష నేతలకు చురకలు అంటించారు.
మేం అధికారంలో వచ్చాక ఆధార్ను తొలగిస్తామన్నారు. కానీ ఆధార్తో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ప్రధాని తెలిపారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో కోటి మందికిపైగా ఉపాధి కల్పించామని ప్రధాని చెప్పారు. పంటకు గిట్టుబాట ధర కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశ జనాభాలో 20 శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సదుపాయం లేదన్నారు. దేశంలో ప్రతి మూలకు విద్యుత్ సరఫరా జరిగేలా పథకం రూపొందించామన్నారు.
కర్ణాటకలో రైల్వే గురించి మల్లిఖార్జున ఖర్గే చేసిన విమర్శలపై మోదీ దీటుగా బదులిచ్చారు. బీదర్-కలబుర్గి రైల్వే లైన్ ఎవరి హయాంలో పట్టాలెక్కిందో నిజం చెప్పాలన్నారు. ఆ ప్రాజెక్ట్కు వాజ్పేయి ప్రభుత్వం 2004లో ఆమోదం తెలిపింది. 2013 వరకూ మీరేం చేయలేదు. యడ్యూరప్ప అధికారంలో ఉన్నప్పుడు పనులు ప్రారంభం అయ్యాయని మోదీ గుర్తు చేశారు.