యాప్నగరం

ఎర్ర కోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారు: ఓవైసీ

తాజ్ మహల్‌ను దేశద్రోహులు నిర్మించారంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.

TNN 16 Oct 2017, 5:22 pm
తాజ్ మహల్‌ను దేశద్రోహులు నిర్మించారంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని.. అక్కడి నుంచి మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆపుతారా అంటూ ఓవైసీ ప్రశ్నించారు. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్‌ను కూడా దేశద్రోహులే నిర్మించారు. దేశ పర్యటనకు వచ్చిన విదేశీ నేతలకు అక్కడ ఆతిథ్యాన్ని మోదీ ఆపేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
Samayam Telugu if taj mahal is built by traitors so is red fort says aimims asaduddin owaisi
ఎర్ర కోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారు: ఓవైసీ


సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీతోపాటు సమాజ్‌వాదీ, నేషన్ కాన్ఫరెన్స్ పార్టీలు సైతం మండిపడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఎర్ర కోట నుంచి కాకుండా నెహ్రూ స్టేడియంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారేమోనని వ్యంగ్యంగా మాట్లాడారు. తాజ్ మహల్‌ను ఎలాంటి వివాదాల్లోకి లాగొద్దు. ఇది ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని సమాజ్ వాదీ నేత జూహి సింగ్ అన్నారు.

Even Hyderabad House in delhi was built by "Traitor"will MODI stop hosting Foreign Dignitaries??— Asaduddin Owaisi (@asadowaisi) October 16, 2017
తాజ్ మహల్ నిర్మాణం భారత సంస్కృతికి మాయని మచ్చ అంటూ బీజేపీ ఎమ్మెల్యే సోమ్ మాట్లాడారు. ఇటీవల యూపీ సర్కారు ప్రచురించిన టూరిజం బుక్ లెట్‌లో తాజ్ మహల్ పేరు లేకపోవడాన్ని ఆయన సమర్థించారు. ఎలాంటి చరిత్ర? ఎవరి చరిత్ర? తండ్రిని జైళ్లో ఉంచిన వ్యక్తి నిర్మించిన వ్యక్తి తాజ్ మహల్‌ను నిర్మించాడని షాజహాన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో హిందువు లేకుండా చేయాలని షాజహాన్ భావించాడని సోమ్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.