యాప్నగరం

#MeToo: IISc వేధింపుల ప్రొఫెసర్‌పై వేటు

పనిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకుని దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ వేధింపులతో బలహీనమయ్యారు.

Samayam Telugu 30 Oct 2018, 3:33 pm
దేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమం ప్రభావం సినీ పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లోనూ కనిపిస్తుంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రొఫెసర్‌ను కచ్చితంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందేనని యాజమాన్యం ఆదేశించింది. ద ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో గిరిధర్ మద్రాస్ ప్రొఫెసర్‌. పనిలో భాగంగా ఎన్నో అవార్డులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గిరిధర్.
Samayam Telugu IISc Professor Giridhar Madras


ఐఐఎస్‌సీ డైరెక్టర్, ప్రొఫెసర్ అనురాగ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గిరిధర్‌పై మా కమిటీ విచారణ చేపట్టింది. ఆ తర్వాతే గిరిధర్ తప్పనిసరి రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించాం. ఐఐఎస్‌సీతో పాటు గతంలోనూ గిరిధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పు చేస్తే ఎవరినీ క్షమించేది లేదని’ ఆయన స్పష్టం చేశారు. ఓ బాధితురాలు తనపై జరిగిన వేధింపులను ఐఐఎస్‌సీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రొఫెసర్, సైంటిస్ట్ బాగోతం బయటపడింది..
చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి

తన పరిశోధనలకుగానూ ఐఐఎస్‌సీ ఎక్సలెన్స్ అవార్డ్, ఎస్ఎస్ భట్నాగర్ అవార్డ్, స్కోపస్ ఆప్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, పలు అకాడమీలు సన్మానించాయి. అన్నామలై యూనివర్సిటీ నుంచి 1988లో బీఈ కెమికల్ ఇంజినీరింగ్‌ చేసిన గిరిధర్.. ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తిచేశారు. టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయన 1993లో ఐఐఎస్‌సీలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.