యాప్నగరం

కారు చౌకగా కరోనా పరీక్ష.. డెవలప్‌చేసిన ఐఐటీ ఢిల్లీ

దేశంలోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ ల్యాబొరేటరీలతోపాటు ప్రయివేట్ సంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది.

Samayam Telugu 23 Mar 2020, 11:49 am
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను అత్యంత తక్కువ మొత్తానికే నిర్వహించే విధానాన్ని ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో ఎక్కువ మందికి పరీక్షలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని ప్రస్తుతం పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఎన్ఐవీ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విధానం విజయవంతమైతే పెద్ద మొత్తంలో పరీక్షలను నిర్వహించడానికి వీలవుతుంది. ‘ప్రోబ్-ఫ్రీ డిటెక్షన్ అసే’ అనే విధానాన్ని ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకుల బృందం రూపొందించింది.
Samayam Telugu ITTDelhi


దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతున్న తరుణంలో కోవిడ్-19ను గుర్తించడానికి స్వదేశీ పరిజ్ఞానం అవరసరమని పరిశోధకుల బృందం వ్యాఖ్యానించింది. తాము రూపొందించిన విధానం వల్ల చాలా తక్కువ ఖర్చుతో పరీక్షను నిర్వహించవచ్చని, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ప్రయివేట్ ల్యాబొరేటరీల్లో నిర్వహించే కరోనా పరీక్షల ధరలపై కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు వసూలు చేసే రుసుం రూ.4,500కు మించరాదని స్పష్టం చేసింది.

వారం రోజుల కిందట వరకు దేశంలోని 72 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబరేషన్‌ లేబొరేటరీస్‌ గుర్తింపు పొందిన 51 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతి ఇస్తామని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రైవేటు ల్యాబ్‌లన్నీ కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షను నామమాత్రపు ధరకే చేయాలని పేర్కొంది. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని 72 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. బయోటెక్నాలజీ శాఖ, డీఆర్‌డీవో వంటి విభాగాలకు చెందిన 49 ల్యాబ్‌లలో పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.