యాప్నగరం

కమ్మేసిన కాలుష్యం.. ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ

ఢిల్లీలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం (నవంబర్ 7) ఉదయం నగరమంతా పరుచుకున్న దట్టమైన పొగ రాజధానివాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఢిల్లీలో ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది.

TNN 7 Nov 2017, 2:03 pm
ఢిల్లీలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం (నవంబర్ 7) ఉదయం నగరమంతా పరుచుకున్న దట్టమైన పొగ రాజధానివాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఢిల్లీలో ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. స్కూళ్లను మూసేసి, విద్యార్థులకు సెలవు ఇవ్వాల్సిందిగా పేర్కొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయిని మించడంతో నవంబర్ 19న జరగాల్సిన మారథాన్‌ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరింది.
Samayam Telugu ima declares state of public health emergency in delhi due to heavy smog
కమ్మేసిన కాలుష్యం.. ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ


సోమవారం సాయంత్రం నుంచే ఢిల్లీలో కాలుష్యం పెరగడం కనిపించింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకే కాలుష్య స్థాయి ప్రమాదకరంగా నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.

గాలిలో కాలుష్య కారకాల స్థాయి 400 పీపీఎంకి అధికంగా ఉంటే.. అది ప్రమాదకర స్థితిని సూచిస్తుంది. అయితే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్నిచోట్ల 800 పీపీఎం వరకూ సూచిస్తోంది. పంజాబీ బాగ్‌, ఆర్కే పురం లాంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయి అత్యధికంగా ఉంది. కాలుష్య స్థాయి 400 పీపీఎంకి తక్కువగా ఎక్కడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.