యాప్నగరం

శనివారం నుండి ప్రధాని ఐదు దేశాల సుడిగాలి పర్యటన

శనివారం నుండి ప్రధాని ఐదు దేశాల పర్యటన ప్రారంభం కానుంది.

Samayam Telugu 3 Jun 2016, 10:35 pm
శనివారం నుండి ప్రధాని ఐదు దేశాల సుడిగాలి పర్యటన ప్రారంభం కానుంది. తన పర్యటనలో భాగంగా ఆయన అఫ్ఘానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటిస్తారు. తన విదేశీ పర్యటన తొలి రోజయిన జూన్ 4న మోడీ అఫ్ఘానిస్థాన్ వెళ్తారు. ఆ తరువాత 4, 5 తేదీల్లో ఖతార్లో పర్యటిస్తారు. అనంతరం 5, 6 రోజుల్లో స్విట్జర్ల్యాండ్ సందర్శిస్తారు. చివరగా 7, 8 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారు. స్విట్జర్ల్యాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ ప్రభుత్వంతో నల్లధనం దాచుకున్న భారత కుబేరుల అంశంపై చర్చించనున్నారని అంటున్నారు. తాను ప్రధాని అయితే స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని మోడీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లయినా ఇప్పటికీ ఈ విషయమై మోడీ చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్న తరుణంలో ఆయన స్విట్జర్ల్యాండ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా పర్యటన సందర్భంగా మోడీ అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగిస్తారు.
Samayam Telugu importance of pm modis whirlwind 5 nation tour
శనివారం నుండి ప్రధాని ఐదు దేశాల సుడిగాలి పర్యటన


ఈ పర్యటన అనంతరం ఆయన వచ్చే జూలై మొదటి భాగంలో మరో నాలుగు దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా, కెన్యా, మొజాంబిక్, దక్షిణాఫ్రికాల్లో ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రధానిగా పదవిని చేపట్టిన తరువాత ఆఫ్రికా ఖండ దేశాల్లో పర్యటించడం మోడీకి ఇదే ప్రథమం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.