యాప్నగరం

కేంద్రం గుడ్ న్యూస్.. ఆ 45 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్..

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 991 కోవిడ్ కేసులు కొత్తగా నమోదు కాగా.. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 19 Apr 2020, 7:06 am
గత 14 రోజుల్లో దేశంలోని 23 రాష్ట్రాల్లో ఉన్న 45 జిల్లాల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 14,792కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 12,700 మందికిపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ మన దేశంలో 488 మంది కరోనా కారణంగా చనిపోగా.. 1991 మంది కోలుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో 991 మంది కరోనా బారిన పడగా.. 43 మంది చనిపోయారని కేంద్రం తెలిపింది.
Samayam Telugu covid rapid test3


భారత్‌లో కోవిడ్ మరణాల రేటు 3.3గా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్ మృతుల్లో 75 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా.. 83 శాతం మందిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 4291 కేసులు తబ్లీగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని లవ్ అగర్వాల్ తెలిపారు. తబ్లీగీతో సంబంధం ఉన్న కేసులు 23 రాష్ట్రాల్లో నమోదయ్యాయన్నారు.

రాష్ట్రపతి భవన్లో పని చేసే పారిశుద్ధ్య సిబ్బంది బంధువు ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని హోం క్వారంటైన్లో ఉంచిన అధికారులు.. ప్రెసిడెంట్ ఎస్టేట్‌ను సీల్ చేశారు. ఆ ప్రాంగణంలో నివసిస్తోన్న 30 కుటుంబాలను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.