సెంచరీకి చేరువైన పెట్రోల్, డీజిల్ ధరలు గత ఐదు రోజులుగా తగ్గుతున్నాయి. పోటాపోటీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పటికీ.. దేశంలో డీజిల్ ధరం కంటే పెట్రోల్ ధరే ఎక్కువగా ఉంటుంది. కానీ పన్నుల వడ్డింపు పుణ్యమా అని దేశంలోనే తొలిసారిగా ఒడిశాలో డీజిల్ ధర పెట్రోల్ కంటే అధికంగా నమోదైంది. ఆదివారం భువనేశ్వర్లో లీటర్ డీజిల్ను రూ. 80.78కి విక్రయించగా.. లీటర్ పెట్రోల్ను రూ.80.65కి విక్రయించారు. వాస్తవానికి శనివారమే పెట్రోల్ ధరల్ని డీజిల్ వెనక్కి నెట్టింది.
పన్నుల భారం తక్కువగా ఉండటం, డీలర్ కమీషన్, బేస్ ధర తక్కువగా ఉండటంతో సాధారణంగా దేశంలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ గత కొద్ది నెలల్లో డీజిల్ బేస్ ధర రూ.5 మేర పెరిగింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
మిగతా రాష్ట్రాల్లో డీజిల్పై వ్యాట్ తక్కువగా ఉంటుంది. కానీ ఒడిశాలో పెట్రోల్, డీజిల్పై 26 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీజిల్ ధర పెట్రోల్ కంటే అధికంగా ఉంది. కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.17.80, డీజిల్పై రూ.13.83 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. డీలర్ కమీషన్ లీటర్ పెట్రోల్కు రూ.3.50 ఉండగా, డీజిల్పై రూ.2.50 ఉంది.
డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. చమురు కంపెనీలపై కేంద్రం నియంత్రణ విధించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి శశి భూషణ్ బెహెరా ఆరోపించగా.. రాష్ట్రం ఎక్కువగా పన్నులు వసూలు చేయడమే దీనికి కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. ఒడిశా ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఆయన సూచించారు.
పన్నుల భారం తక్కువగా ఉండటం, డీలర్ కమీషన్, బేస్ ధర తక్కువగా ఉండటంతో సాధారణంగా దేశంలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ గత కొద్ది నెలల్లో డీజిల్ బేస్ ధర రూ.5 మేర పెరిగింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
మిగతా రాష్ట్రాల్లో డీజిల్పై వ్యాట్ తక్కువగా ఉంటుంది. కానీ ఒడిశాలో పెట్రోల్, డీజిల్పై 26 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ డీజిల్ ధర పెట్రోల్ కంటే అధికంగా ఉంది. కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.17.80, డీజిల్పై రూ.13.83 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. డీలర్ కమీషన్ లీటర్ పెట్రోల్కు రూ.3.50 ఉండగా, డీజిల్పై రూ.2.50 ఉంది.
డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. చమురు కంపెనీలపై కేంద్రం నియంత్రణ విధించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి శశి భూషణ్ బెహెరా ఆరోపించగా.. రాష్ట్రం ఎక్కువగా పన్నులు వసూలు చేయడమే దీనికి కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. ఒడిశా ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఆయన సూచించారు.