యాప్నగరం

ఆ రైల్వే స్టేషన్లో అంతా ఆడవారే!

స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ కలెక్టర్ వరకు.. చివరికి రైల్వే పోలీసులు కూడా మహిళలే. పూర్తిగా మహిళల ఆధీనంలో నడుస్తున్న ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా?

TNN 20 Feb 2018, 9:31 pm
ఆ రైల్వే స్టేషన్లో.. టికెట్ కలెక్టర్ నుంచి స్టేషన్ మాస్టర్ వరకు.. స్టేషన్ సూపరింటెండెంట్ నుంచి పాయింట్స్‌మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ మహిళలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆ స్టేషన్ నిర్వహణ బాధ్యతలన్నీ ఆడవారివే. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా? రాజస్థాన్‌లోని గాంధీనగర్‌లో.
Samayam Telugu in yet another first for india jaipurs gandhinagar becomes an all women railway station
ఆ రైల్వే స్టేషన్లో అంతా ఆడవారే!


సోమవారం (ఫిబ్రవరి 19) నుంచి ఈ రైల్వే స్టేషన్లో మహిళల ఆధీనంలోకి వచ్చింది. దేశంలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా ఇండియన్ రైల్వేస్ రికార్డులకెక్కింది. ఈ రైల్వే స్టేషన్లో నిత్యం 7వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు చేస్తారు. దాదాపు 50 రైళ్లు వచ్చిపోతుంటాయి. 25 రైళ్లను ఇక్కడే నిలుపుతారు. ఇక్కడి బాధ్యతలు చూసుకుంనేందుకు 40 మహిళా సిబ్బందిని నియమించారు.

కమర్షియల్ ఆపరేషన్ల నుంచి ట్రాక్‌ల నిర్వహణ, ట్రాఫిక్ తదితర పనులున్నీ మహిళా సిబ్బందే నిర్వహిస్తారు. ఇక్కడి రైల్వే మహిళా సిబ్బంది కోసం రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కూడా 11 మంది మహిళా పోలీసులను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ స్టెల్లా మాట్లాడుతూ.. ‘‘స్టేషన్‌ను నిర్వహించే బాధ్యతలు వస్తాయని ఏ రోజూ ఊహించలేదు. రైల్వేకు సంబంధించిన అన్ని భద్రతా నియమాలను సక్రమంగా పాటించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తాం’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.