యాప్నగరం

నోట్లు మార్చుకున్నవారి వేలికి సిరా గుర్తు: కేంద్రం

బ్యాంకులకొచ్చి రద్దు చేసిన నోట్లను మార్చుకుంటున్న వారి చేతివేలికి ఇకపై మాయని సిరా గుర్తును వేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

TNN 15 Nov 2016, 2:54 pm
బ్యాంకులకొచ్చి రద్దు చేసిన నోట్లను మార్చుకుంటున్న వారి చేతివేలికి ఇకపై మాయని సిరా గుర్తును వేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఒకసారి పెద్ద నోట్లను మార్చుకున్న వారు పదే పదే బ్యాంకులకొస్తున్నారని, దీన్ని నిరోధించడానికి వారి చేతివేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించామని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.
Samayam Telugu indelible ink to mark fingers of those who have exchanged old notes
నోట్లు మార్చుకున్నవారి వేలికి సిరా గుర్తు: కేంద్రం


కొంత మంది గ్రూపులుగా ఏర్పడి తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ఒకే రోజు పలు బ్యాంకులకు అనేకసార్లు వస్తున్నారని, దీన్ని సిరా గుర్తు వేయడం ద్వారా నిరోధిస్తామని శక్తికాంత్ చెప్పారు. ఎన్నికల్లో మాదిరిగా వేలిపై మార్క్ వేస్తారని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఏటీఎంల వద్ద సామాన్యులు బారులు తీరడానికి కూడా ఇదే కారణమని ఆయన తెలిపారు.

బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఇలాంటి వాటిని ప్రజలు నమ్మొద్దని శక్తికాంత్ సూచించారు. బ్యాంక్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లపై కూడా నిఘా పెట్టామని, జన్‌ధన్ అకౌంట్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.