యాప్నగరం

చైనా ఆర్మీతో భారత సైన్యం కొత్త సంవత్సర వేడుకలు

ఇండియా, చైనా సైనికులు ఉమ్మడిగా కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సిక్కింలోని నాథులా ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది.

Samayam Telugu 1 Jan 2019, 10:31 pm
కొత్త ఏడాది సందర్భంగా సిక్కింలోని నాథులా అరుదైన సందర్భానికి వేదికైంది. భారత్, చైనా దేశాలకు చెందిన సైనికులు కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పరస్పరం శుభాభినందనలు తెలుపుకున్నారు. సరిహద్దు వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య విశ్వాసాన్ని పెంచడానికి, ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఉమ్మడిగా ఈ వేడుకలను నిర్వహించారు. మంగళవారం (జనవరి 1) ఉదయం నిర్వహించిన ఈ కొత్త సంవత్సర వేడుకల్లో ఇండియన్ ఆర్మీ, చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Samayam Telugu new year


భారత్, చైనా దేశాల సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఇరు పక్షాల నుంచి కల్నల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇరు దేశాలు చెందిన సైనికులు స్వీట్లు పంచుకుంటూ.. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదంగా గడిపారు. దీంతో నాతులా వద్ద సందడి నెలకొంది.

సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణాన్ని, ప్రశాంతతను పెంపొందించడానికి తాజా చర్య ఎంతగానో ఉపకరిస్తుందని ఇరు దేశాల సైనికాధికారులు అభిప్రాయపడ్డారు. డోక్లాం వివాదం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల సైనికులు చేపట్టిన తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.