యాప్నగరం

భారత్‌-పాక్‌ విదేశాంగ మంత్రుల భేటీ రద్దు

పాక్‌తో శాంతి చర్చల విషయంలో భారత్ కీలక నిర్ణయం.. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ రద్దు.. కారణాలివే..

Samayam Telugu 21 Sep 2018, 8:48 pm
వెన్ను పోటు.. నక్క జిత్తులకు కేరాఫ్ అడ్రస్ దాయాది దేశం పాకిస్థాన్. ఓవైపు భారత్‌తో శాంతి చర్చలంటూనే.. మరోవైపు ఉగ్రవాదుల్ని ఎగదోసి అమాయకుల ప్రాణాలు తీయిస్తోంది. మొన్న పాక్ రేంజర్లు భారత జవాన్‌ను ఊచకోత కోయించింది.. తాజాగా ఉగ్రవాదుల్ని ఉసిగొల్పి కాశ్మీర్‌లో పోలీసులను హత్య చేయించింది. ఇది చాలదన్నట్లు పుండు మీద కారం చల్లుతూ కాశ్మీర్ ఉగ్రవాది బుర్హాన్ వానీ పేరు మీద తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ తాజా పరిణామాలతో.. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సమయంలో పాక్‌తో శాంతి చర్చలు జరపాలన్న నిర్ణయాన్ని భారత్ విరమించుకుంది. భారత్-పాక్ విదేశాంగ మంత్రుల భేటీ రద్దయ్యింది.
Samayam Telugu India


ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ సమావేశం రద్దుపై ప్రకటన చేశారు. ‘తాజా పరిణామాలన్నీ చూశాక.. పాక్‌తో ఇంకా మాట్లాడటంలో అర్థమే లేదు.. 24 గంటల క్రితమే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అవుతారని ప్రకటించాం.. కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు శుక్రవారం ఉదయం పోలీసుల్ని హత్య చేయడం.. టెర్రరిస్టుల స్టాంపులు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’అన్నారు

‘ఇరు దేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ .. ప్రజలకు, భవిష్యత్తు తరాల కోసం చర్చలు జరుపుదామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. భారత ప్రధాని మోదీని కోరారు. త్వరలో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో భాగంగా భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేలా చూడాలని అభ్యర్థించారు. కాని ఈ తాజా ఘటనలతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అస‌లు స్వ‌రూపం బయటపడింది.. ప్రపంచానికి కూడా తెలిసిందన్నారు’రవీష్ కుమార్. అందుకే విదేశాంగ మంత్రుల భేటీని రద్దు చేస్తున్నామన్నారు.

భారత్‌, పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం చివరి సారిగా 2015లో జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట్ వైమానిక కోటపై పాక్‌ ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.