యాప్నగరం

అప్పుడు మనం సానుభూతి చూపితే.. ఇప్పుడు పాకీలు సంబరాలు చేసుకుంటున్నారు

2014.. పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడితే భారతీయులు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని నోరు మెదపడం లేదు. పాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Samayam Telugu 15 Feb 2019, 10:20 pm

ప్రధానాంశాలు:

  • 2014.. పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడితే భారతీయులు అండగా నిలబడ్డారు.
  • కానీ ఇప్పుడు పాక్ ప్రధాని నోరు మెదపడం లేదు.
  • పాక్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pak-ind
పుల్వామా దాడి ఘటన పట్ల ప్రపంచ దేశాలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. కొందరు పాకిస్థానీలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు బాసటగా నిలుస్తుంటే.. పాక్ ప్రధాని మాత్రం నోరు మెదపలేదు. పాకిస్థాన్ మీడియా అయితే దాడిక పాల్పడిన వారికి స్వాతంత్య్ర పోరాట యోధులుగా అభివర్ణించింది. 2014లో పెషావర్ పాఠశాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినప్పుడు భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్థాన్‌కు అండగా నిలబడ్డారు.
కానీ పుల్వామాలో ఉగ్రవాదులు సైనికులపై దాడికి పాల్పడి 49 మందిని పొట్టనబెట్టుకుంటే.. పాకిస్థానీలు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ జరగాలని కోరుకుంటున్నామని ట్వీట్లు చేస్తున్నారు.


అసలే జవాన్లను కోల్పోయి బాధలో ఉన్న భారతీయును ఈ పోస్టులు మరింత రెచ్చగొడుతున్నాయి. భారత్‌కు, పాకిస్థాన్‌కు మధ్య తేడా ఇదేనని చెబుతూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.