దేశంలో బీఏ 4 వేరియంట్ రెండో కేసు తమిళనాడులో నమోదయ్యింది. చెంగల్పట్టు జిల్లా నవలూర్ గ్రామంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఏ4 కేసు (BA4 Variant) నమోదైనట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ శనివారం వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. రెండు రోజుల కిందటే హైదరాబాద్లో బీఏ4 వేరియంట్ మొదటి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ సోకిన బాధితుడిది చెన్నైకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగల్పట్టు జిల్లాలోని నవలూరు. దీనిపై ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ కన్సార్టియం (INSACOG) సోమవారం బులిటెన్ ప్రకటించనుంది. గురువారం తెలంగాణలో బీఏ.4 వేరియంట్కు (Omicron Sub Variant) సంబంధించిన తొలి కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఈ కొత్త వేరియెంట్ సోకినట్టు గుర్తించారు. మే నెల మొదటి వారంలో దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్లో సమావేశానికి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. అతడికి పాజిటివ్ రావడంతో జన్యు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బీఏ 4 వేరియంట్ అని తేలింది. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న 24 మందికీ టెస్టులు నిర్వహించగా.. వారికి నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వారందర్నీ వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి మే 16 తిరిగి వెళ్లిపోయారని, ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఈ వేరియంట్ను మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో మొదటిసారి జనవరి 10న గుర్తించారు. ప్రస్తుతం అక్కడ బీఏ.4 వేరియంట్ కారణంగానే భారీగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 31 శాతం దాటేసినట్టు ఇటీవల దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ వేరియంట్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో.. డబ్ల్యూహెచ్వో (WHO) వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. మరోవైపు, రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2323 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.
కాగా, ఈ వేరియంట్ను మొదటిసారిగా దక్షిణాఫ్రికాలో మొదటిసారి జనవరి 10న గుర్తించారు. ప్రస్తుతం అక్కడ బీఏ.4 వేరియంట్ కారణంగానే భారీగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 31 శాతం దాటేసినట్టు ఇటీవల దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ వేరియంట్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో.. డబ్ల్యూహెచ్వో (WHO) వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. మరోవైపు, రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2323 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.